Jammu Kashmir: జమ్మూ కశ్మీర్లో పలుచోట్ల కుంగుతున్న భూమి
ABN , Publish Date - Sep 14 , 2025 | 06:33 AM
భారీ వర్షాల కారణంగా జమ్మూ కశ్మీర్లోని పలుచోట్ల భూమి కుంగుతోంది. జమ్మూ ప్రాంతంలోని రాంబన్, కిష్ట్వార్, పూంచ్, రెసాయ్, కథువా జిల్లాల్లోని 19 ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది....
జమ్మూ, సెప్టెంబరు 13: భారీ వర్షాల కారణంగా జమ్మూ కశ్మీర్లోని పలుచోట్ల భూమి కుంగుతోంది. జమ్మూ ప్రాంతంలోని రాంబన్, కిష్ట్వార్, పూంచ్, రెసాయ్, కథువా జిల్లాల్లోని 19 ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. పూంచ్ జిల్లాలోని కాలాబన్ గ్రామంలో సుమారు 100 నిర్మాణాలు బీటలువారాయి. మూడు స్కూలు భవనాలు, ఓ మసీదు, గ్రామానికి వచ్చే రోడ్డు కూడా దెబ్బతిన్నాయి. ఈ పరిణామంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. 700లకు పైగా గ్రామస్థులను పునరావాస శిబిరాలకు తరలించారు. లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇళ్లు కళ్ల ముందే బీటలు వారాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్ మంత్రి జావెద్ రాణా ఆ గ్రామాన్ని సందర్శించి పరిస్థితి అంచనా వేశారు. పునరావాస పనులను పర్యవేక్షించారు. అధిక వర్షపాతం వల్ల గత కొన్ని రోజులుగా పూంచ్, రాజౌరీ, కశ్మీర్ ప్రాంతాల్లో భూమి కుంగుతోందని తెలిపారు. ఇలాంటి పరిస్థితే రాంబన్ జిల్లాలోని టాంగర్ ప్రాంతం, జమ్మూ శివారు ప్రాంతాల్లో నెలకొంది. ఇక్కడి నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా
For More National News and Telugu News