COVID India: దేశంలో 3395కు పెరిగిన కొవిడ్ కేసులు
ABN , Publish Date - Jun 01 , 2025 | 04:41 AM
దేశంలో యాక్టివ్ కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతూ శనివారం నాటికి 3,395కి చేరుకున్నాయి. కేరళలోనే అత్యధికంగా 1,336 కేసులు నమోదవగా, ఢిల్లీ, మహారాష్ట్రలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
న్యూఢిల్లీ, మే 31: దేశంలో యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ 3వేల మార్కును దాటేసింది. కేరళ రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాల ద్వారా వెల్లడైంది. గత 24 గంటల్లో ఢిల్లీ, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. మే 22 నాటికి దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉండేవి. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ మే 26 నాటికి 1,010కి, శనివారం నాటికి 3,395కి చేరుకుంది. గత 24 గంటల్లోనే 685 కొత్త కేసులు నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక కేసుల విషయానికి వస్తే.. కేరళలో అత్యధికంగా 1,336 యాక్టివ్ కేసులున్నాయి.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్లో కరోనా.. ఐసోలేషన్కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News