Pahalgam Attack Victims: పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటన..
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:02 PM
జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. దీంతోపాటు తీవ్రంగా గాయపడిన వారికి సహాయాన్ని అందిస్తామని తెలిపింది. అయితే కేంద్రం కూడా దీనిపై పరిహారం ప్రకటించే ఛాన్సుంది.
పహల్గామ్ కొండల్లో నిశ్శబ్దాన్ని చీల్చిన ఉగ్రవాద దాడి అనేక మందిని కలచివేసింది. అమాయక ప్రాణాలు ఊహించని విధంగా పోవడం, వారి కుటుంబాల్లో శోకసంద్రం నెలకొంది. ఈ విషాద సమయంలో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం బాధిత కుటుంబాల పట్ల తన బాధ్యతను చాటుకుంది. మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల సహాయం, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ సహాయం వారి గాయాల్ని పూర్తిగా నయం చేయకపోయినా, బాధిత కుటుంబాలకు కొంత భరోస అందించే ప్రయత్నమని చెప్పవచ్చు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం..
ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ఎక్స్ లో పోస్ట్ చేసి ఈ మేరకు ప్రకటించింది. నిర్దోష పౌరులపై చేసిన ఈ హింసాత్మక, అమానుష చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటన మానవతకు పూర్తి విరుద్ధమైనది". మేం విలువైన ప్రాణాలను కోల్పోయాం. ఆ బాధను ఏ ఆస్తి కూడా భర్తీ చేయలేదు. కానీ బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు ఈ ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నామని సీఎంఓ తెలిపింది. అంతేగాక, మృతదేహాల్ని సగౌరవంగా వారి స్వగ్రామాలకు తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కేంద్రం కూడా..
గాయపడినవారికి అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని చెప్పింది. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామంది. దీంతోపాటు ఈ క్రూర చర్యకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సహాయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సహాయం బాధితులకు కొంత ఊరటనిచ్చేలా ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతి, న్యాయం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో కేంద్రం కూడా భరోసా కల్పిస్తే బాధిత కుటుంబాలకు మరింత ఊరట లభించనుంది.
ఇవి కూడా చదవండి:
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడి.. భారత్కు మద్దతుగా ప్రపంచ నేతల సంఘీభావం
Pahalgam Terror Attack: హృదయాన్ని కదిలించే విషాదం..పహల్గామ్ ఉగ్రదాడిలో అర్ధాంతరంగా ఆగిన జీవితం
PM Modi: విమానాశ్రయంలో దిగిన వెంటనే.. అజిత్ దోవల్, జైశంకర్తో మోడీ అత్యవసర భేటీ
PM Modi: ప్రధాని మోదీ సౌదీ టూర్ రద్దు..ఇండియాకు వచ్చేసిన పీఎం
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News