India Destroys Pak Bunker: భారత ఆర్మీ భీకర దాడి.. పాక్ బంకర్ ధ్వంసం
ABN , Publish Date - May 09 , 2025 | 06:56 PM
జమ్మూలో సామాన్యులను టార్గెట్ చేస్తున్న పాక్ బంకర్ను భారత్ ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: సామాన్య పౌరులను టార్గెట్ చేస్తున్న పాక్కు భారత ఆర్మీ తాజాగా గట్టి షాకిచ్చింది. పీఓకేలో ఉన్న ఓ బంకర్ను ధ్వంసం చేసింది. ఈ బంకర్ కేంద్రంగా పాక్ జమ్మూకశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు దిగుతున్నట్టు సమాచారం. వాస్తవాధీన రేఖకు ఆవల పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న బంకర్ను నేటి ఉదయం సుమారు 5.44 గంటల సమయంలో భారత దళాలు ధ్వంసం చేశాయి. భారీ పేలుడుతో ఒక్కసారిగా రేగిన మంటల్లో పడి బంకర్ తుత్తునీయలైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఈ బంకర్ ధ్వంసంతో పాక్కు భారత్ గట్టిబుద్ధి చెప్పిందని నిపుణులు చెబుతున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని భారత్ స్పష్టం చేసిందని అంటున్నారు.
వాస్తవాధీన రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గురువారం రాత్రి భారత్ సుమారు 50 పాక్ డ్రోన్లను కూల్చివేసింది. భారత్లోని వివిధ ప్రాంతాలపై స్వార్మ్ డ్రోన్లు పంపించేందుకు పాక్ విఫలయత్నం చేసిన తరువాత భారత్ కౌంటర్ డ్రోన్ ఆపరేషన్ పెద్ద ఎత్తున చేపట్టినట్టు తెలుస్తోంది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్.. సరిహద్దు వెంబడి భారీ ఎత్తున మిసైల్ వ్యవస్థలను మోహరించాయి. ఏప్రిల్ 22 పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించి పాక్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఇక తాజా పత్రికా సమావేశంలో పాక్ దుర్నీతిని భారత్ మరోసారి ఎండగట్టింది. ఆధ్యాత్మిక, మతపరమైన నిర్మాణాలు, విద్యాసంస్థలను కూడా పాక్ టార్గెట్ చేసుకుంటోందని కేంద్ర ప్రభుత్వం ఆధారాలతో సహా పేర్కొంది. పౌర విమానాల మాటున దాడులకు యత్నిస్తోందని మండిపడింది.
Also Read:
పాక్తో ఉద్రిక్తతలు.. దేశ ప్రజలకు రోహిత్ శర్మ రిక్వెస్ట్
సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
ఇండో-పాక్ వార్పై చైనా షాకింగ్ రియాక్షన్.. ఏమందంటే..
పాకిస్తాన్ నిజస్వరూపం బట్టబయలు
For National News And Telugu News