Delhi Rains: ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు
ABN , Publish Date - Aug 14 , 2025 | 08:39 AM
ఈ ఉదయం నుంచి ఢిల్లీతోపాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. లజ్పత్ నగర్, ఆర్కె పురం, లోధి రోడ్, ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ అంతటా కురుస్తున్న భారీ వర్షాలకు మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 14 : ఈ తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో, జాతీయ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. లజ్పత్ నగర్, ఆర్కె పురం, లోధి రోడ్, ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) నివేదిక ప్రకారం, ఇవాళ (గురువారం) ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీలో ఇవాళ గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇదిలా ఉండగా, హిమాచల్ ప్రదేశ్ అంతటా కురుస్తున్న భారీ వర్షాలకు మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత 24 గంటల్లో భారీ వర్షాల కారణంగా 323 రోడ్లు, 70 విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్లు (DTRలు), 130 నీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SDMA) తెలిపింది. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి, రాష్ట్రంలో 241 మంది మరణించారని, వాటిలో 126 మంది వర్షాధార విపత్తులతో సంబంధం కలిగి ఉన్నారని, కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు, నీటిలో కొట్టుకుపోవడం, పిడుగులు, పాముకాట్లు, విద్యుత్ షాక్లు, రోడ్డు ప్రమాదాలకు 115 మంది మరణించారని SDMA తన నివేదికలో తెలిపింది.
ప్రజా పనుల శాఖ, జల్ శక్తి విభాగ్, విద్యుత్ రంగాలు.. భారీ వర్షాల కారణంగా భారీ నష్టాల భారాన్ని చవిచూశాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. వర్షాలు కొనసాగితే పునరుద్ధరణ చర్యలు ఆలస్యం కావచ్చని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాకిస్థాన్ బెదిరింపులకు భయపడేది లేదు
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి
Read Latest Telangana News and National News