Bomb making Flour mill found: ఉగ్రవాది ఇంట్లో బాంబు తయారీ మిషన్ పట్టివేత
ABN , Publish Date - Nov 21 , 2025 | 03:31 PM
ఫరీదాబాద్లోని ఓ ఉగ్రవాది ఇంట్లో బాంబు తయారీకి ఉపయోగించే పిండి మిల్లును స్వాధీనం చేస్కున్నారు అధికారులు. ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో అరెస్టైన షకీల్.. దీనిని బాంబుల తయారీకి వినియోగించేవాడని దర్యాప్తులో తేలింది.
ఇంటర్నెట్ డెస్క్: హరియాణాలోని ఓ ఉగ్రవాది ఇంట్లో బాంబు తయారీకి ఉపయోగించే పిండి మిల్లు యంత్రాన్ని(Flour Mill Used For Bomb Making) స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు అధికారులు. ఫరీదాబాద్లోని ఓ ట్యాక్సీ డ్రైవర్ ఇంట్లో.. ఈ మిషన్తో పాటు ఎలక్ట్రిక్ యంత్రాలనూ(flour mill and electrical machinery) స్వాధీనం చేసుకున్నట్టు వారు వెల్లడించారు. ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో అరెస్టైన ముజామ్మిల్ షకీల్(Muzammil Shakeel).. ఈ మిల్లును బాంబు తయారీకి అవసరమయ్యే రసాయనాలను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించేవాడని తెలిపారు.
నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో షకీల్ను అరెస్ట్ చేశారు పోలీసులు. జమ్ము కశ్మీర్లోని పుల్వామా(Pulwama)కు చెందిన ఇతడు.. ఫరీదాబాద్లో ఓ కిరాయి ఇంట్లో ఉంటూ ఈ పిండి మిల్లును ఉపయోగించేవాడు. యూరియా(Urea)ను పిండి మిల్లులో వేసి మెత్తగా రుబ్బి, అనంతరం దాన్ని ఎలక్ట్రిక్ మిషన్లో వేసి అమ్మోనియం నైట్రేట్(Ammonium Nitrate) వేరు చేయడం, పేలుడు పదార్థాలను శుద్ధి చేయడం వంటివి చేసేవాడు. ఇతడు ఉత్పత్తి చేసిన వాటిలో 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ సహా సుమారు 2900 పేలుడు పదార్థాలను అదే ప్రాంతంలో నవంబర్ 9న స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు అధికారులు.
ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడిలో 15 మంది మృతికి కారణమైన బాంబు పేలుడు కేసులో భాగంగా దర్యాప్తు బృందం.. ఓ ట్యాక్సీ డ్రైవర్ను విచారించగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. సదరు డ్రైవర్.. నాలుగేళ్ల క్రితం చికిత్స నిమిత్తం అల్-ఫలాహ్ ఆస్పత్రి(Al-Falah Hospital)కి వెళ్లడంతో షకీల్తో సన్నిహిత సంబంధాలు నెలకొన్నట్టు విచారణలో తేలింది.
ఇవీ చదవండి: