Election Commission: ఎస్ఐఆర్ నిర్వహణ మా పరిధిలోనిదే
ABN , Publish Date - Sep 14 , 2025 | 06:28 AM
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) మీద పూర్తి అధికారాలు తమవేనని, దీనిపై సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేసినా అది తమ పరిధిలో జోక్యం చేసుకోవటమే అవుతుందని ఎన్నికల సంఘం...
దాంట్లో న్యాయస్థానాల జోక్యం వద్దు
సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన ఈసీ
2026 జనవరి 1 ప్రాతిపదికగా
దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) మీద పూర్తి అధికారాలు తమవేనని, దీనిపై సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేసినా అది తమ పరిధిలో జోక్యం చేసుకోవటమే అవుతుందని ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రతీ ఎన్నికకు ముందు ఎస్ఐఆర్ నిర్వహించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఈసీ ఈ మేరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం పార్లమెంటుకు, దేశంలోని అన్ని శాసనసభలకు ఎన్నికలు నిర్వహించటం, ఓటర్ల జాబితాను సిద్ధం చేయటం పూర్తిగా తమకు సంబంధించిన విషయమేనని ఈసీ పేర్కొంది. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను బట్టి ఓటర్ల జాబితాను సమూలంగా ప్రక్షాళన చేయాలా? లేక, కొన్ని మార్పులు సరిపోతాయా? అన్నది ఈసీ నిర్ణయాధికారమని తెలిపింది. దీంట్లో భాగంగానే బిహార్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లో 2026 జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా ఎస్ఐఆర్ చేపట్టాలని గత నెల 5వ తేదీన ఎన్నికల ప్రధానాధికారులకు (సీఈఓలకు) ఆదేశాలు జారీ చేశామని ఈసీ సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా
For More National News and Telugu News