Share News

Pahalgam Terror Attack: ముమ్మర తనిఖీలు.. పోలీసులు అదుపులో 400 మంది

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:05 PM

Pahalgam Terror Attack: ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పోలీసులు సోదాలు ముమర్మం చేశారు. అందులోభాగంగా 400 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసులు విచారించారు.

Pahalgam Terror Attack: ముమ్మర తనిఖీలు.. పోలీసులు అదుపులో 400 మంది

అహ్మదాబాద్, ఏప్రిల్ 26: జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో భారత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులోభాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరవ్యాప్తంగా శనివారం క్రైమ్ బ్రాంచ్ అధ్వర్యంలో ముమ్మర తనిఖీలు, సోదాలు నిర్వహించింది. అందులోభాగంగా 400 మందికిపైగా అనుమానాస్పద వలసదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారిని విచారించారు. వీరిలో 127 మంది బంగ్లా దేశీయులు అక్రమంగా దేశంలో నివసిస్తున్నట్లు గుర్తించారు. విచారణ అనంతరం వారి వారి ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించామని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అజిత్ రాజియన్ వెల్లడించారు. అహ్మదాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీ వలసదారులను పట్టుకోవడానికి ఈ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు డీసీపీ సోదాహరణంగా వివరించారు.


మార్చి 22వ తేదీన జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. దీంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు పోటా పోటీగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అలాంటి వేళ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్థాన్ జాతీయులను వెంటనే వెనక్కి పంపాలని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొంది.

దాంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. శుక్రవారం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మీ మీ రాష్ట్రాల్లో నివసిస్తున్న అక్రమ వలసదారులు మరి ముఖ్యంగా పాకిస్థానీయులను గుర్తించి.. వారిని వెంటనే పాకిస్థాన్ పంపాలని వారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు.


మరోవైపు పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్ ప్రమేయం ఉందని భారత్ తగిన ఆధారాలను సేకరించింది. అందుకు సంబంధించిన ఆధారాలను భారత్‌లోని పలు దేశాల రాయబారులకు భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ అందజేసిన విషయం విధితమే.

ఇవి కూడా చదవండి..

Pahalgam Terror Attack: మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత

India Vs Pakistan: సరిహద్దు వద్ద పాక్ మళ్లీ కాల్పులు..

Letter to CM: మావోయిస్టులతో చర్చలకు ముగ్గురు పేర్లు ప్రతిపాదన

Pahalgam Terror Attack: అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం

Virginia Giuffre: వర్జీనియా గియుఫ్రే ఆత్మహత్య

For National News And Telugu News

Updated Date - Apr 26 , 2025 | 12:05 PM