Bihar Elections: నాడు నోట్ల రద్దు.. నేడు ఓట్ల రద్దు
ABN , Publish Date - Jul 18 , 2025 | 05:49 AM
ఓటర్ల నుంచి ఓటు హక్కును లాక్కోవటం ద్వారా బిహార్ ఎన్నికల్లో భారీ ఎత్తున రిగ్గింగ్ చేయటానికి కుట్ర జరుగుతోందని, దాంట్లో భాగంగానే ఎన్నికల సంఘం
బిహార్లో భారీ ఎత్తున ఓట్ల తొలగింపు ద్వారా రిగ్గింగ్కు కుట్ర: రాహుల్
న్యూఢిల్లీ, జూలై 17: ఓటర్ల నుంచి ఓటు హక్కును లాక్కోవటం ద్వారా బిహార్ ఎన్నికల్లో భారీ ఎత్తున రిగ్గింగ్ చేయటానికి కుట్ర జరుగుతోందని, దాంట్లో భాగంగానే ఎన్నికల సంఘం (ఈసీ) ఆ రాష్ట్రంలో ‘ఓటర్ల జాబితా సవరణ’ (సర్)ను చేపట్టిందని కాంగ్రెస్ ఆరోపించింది. గతంలో నోట్లరద్దు చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు బిహార్లో ఓట్లరద్దుకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తింది. గురువారం ఈ అంశంపై ఆ పార్టీ నేతలు పలువురు ఎక్స్లో పోస్ట్లు పెట్టారు. ‘సర్ పేరుతో ఓట్లను దొంగిలిస్తూ ఈసీ రెడ్హ్యాండెడ్గా పట్టుబడింది. చేసేదేమో దొంగతనం.. పేరు మాత్రం సర్. దీనిని బట్టబయలు చేసిన వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు’ అంటూ రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు.