BJP Files Case: కాంగ్రెస్ ఐటీ సెల్పై బీజేపీ కేసు
ABN , Publish Date - Sep 14 , 2025 | 06:39 AM
ప్రధాని మోదీ తల్లిని అవమానించారంటూ బీజేపీ చేసిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ ఐటీ సెల్పై ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. కృత్రిమ మేధ సాయంతో కాంగ్రెస్ బిహార్ శాఖ...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: ప్రధాని మోదీ తల్లిని అవమానించారంటూ బీజేపీ చేసిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ ఐటీ సెల్పై ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. కృత్రిమ మేధ సాయంతో కాంగ్రెస్ బిహార్ శాఖ రూపొందించి, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వీడియోపై అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు చేసింది. ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్ పోలికలు ఉన్న పాత్రలతో కాంగ్రెస్ ఆ వీడియోను సృష్టించింది. ‘సాహెబ్ కలలోకి వచ్చిన అమ్మ’ పేరుతో హిందీలో రూపొందించిన ఆ వీడియోలో మోదీని తల్లి తిడుతున్నట్టు ఉంటుంది. ‘ఈ రోజు ఓట్ చోరీ పూర్తయింది. ఇక నిద్రపోదాం’ అని మోదీ పాత్రధారి అనడం అందులో కనిపిస్తుంది. దానిపై తల్లి పాత్రధారి స్పందిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును దుర్వినియోగం చేస్తున్నావంటూ మందలిస్తుంది. ‘నోట్ల రద్దు వేళ నన్ను లైనులో నిలబెట్టావు. అనంతరం నా కాళ్లు కడుగుతూ రీల్స్ చేశావు. రాజకీయాల కోసం ఎన్నిసార్లు దిగజారుతావు?’ అంటూ ప్రశ్నించడం ఆ వీడియోలో ఉంది.
ఇవి కూడా చదవండి..
Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా
For More National News and Telugu News