Tamilnadu: రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్.. స్టాలిన్ సర్కార్పై బీజేపీ సంచలన ఆరోపణ
ABN , Publish Date - Mar 14 , 2025 | 04:13 PM
లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే త్రిభాషా విధానంపై స్టాలిన్ వదంతులు వ్యాప్తి చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. కాగా, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని డీఎంకే కొట్టివేసింది.

చెన్నై: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) ద్వారా రూ.1000 కోట్ల లిక్కర్ కుంభకోణానికి (Liquor Scam) పాల్పడిందని బీజేపీ (BJP) సంచలన ఆరోపణ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిపిన దాడుల్లో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు వెల్లడైందని చెప్పింది. లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే త్రిభాషా విధానంపై స్టాలిన్ వదంతులు వ్యాప్తి చేస్తు్న్నారని విమర్శించింది. కాగా, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని డీఎంకే కొట్టివేసింది.
Jaffar Express Attack: ఉగ్రవాదానికి కేంద్ర స్థానం ఎవరో ప్రపంచానికి తెలుసు... పాక్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారంనాడు 2025-26 బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ తరుణంలోనే బీజేపీ తాజా ఆరోపణలకు దిగింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెనరసు వివిధ సంక్షేమ పథకాలను బడ్జెట్లో ప్రవేశపెట్టారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉపాధి కల్పన, మౌలిక వసతుల అభివృద్ధికి కీలక కేటాయింపులు జరిపారు.ఈ సందర్భంగా ఈడీ దాడుల్లో ఆర్థిక అవకతవకలు, లిక్కర్ స్కా్మ్ వెలుగుచూసినట్టు అన్నాడీఎంకే సభ్యులు ఆరోపిస్తూ, ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సభనుంచి సభ్యలు వాకౌట్ చేశారు.
బీజేపీ ఆరోపణ
కాగా, TAAMAC, లిక్కర్ మంత్రి, లిక్కర్ సప్లయ్ కంపెనీలపై ఈడీ దాడులు జరుగుతున్నందున ప్రజల దృష్టిని మళ్లించేందుకు త్రిభాషా విధానం, ఎన్ఈపీపై స్టాలిన్ తప్పుడు వదంతలను ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు. ఈడీ దాడుల్లో డిస్ట్రిలరీల నుంచి ముడుపుల రూపంలో వసూలై, లెక్కల్లో చూపించని రూ.1,000 కోట్ల లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోందని, ఈ అక్రమ చెల్లింపులు ఎవరు అందుకున్నారో సీఎం వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాగా, లిక్కర్ స్కా్మ్ ఆరోపణలపై రూల్ 55 కింద సభలో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాశారు.
మంత్రి సెంథిల్ వివరణ
కాగా, టీఏఎస్ఎంఏసీ ఆపరేషన్స్లో అవకతవకలకు అవకాశమే లేదని తమిళనాడు ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ తెలిపారు. సోదాల పేరుతో ఈడీ దాడులు చేసినప్పటికీ ఏ సంవత్సరంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారో చెప్పలేదన్నారు. టీఏఎస్ఎంఏసీ రిక్రూట్మెంట్లో పొరపాట్లు జరిగి ఉండవచ్చనే అభిప్రాయంతో లేనిపోని ఆరోపణలకు దిగడం సరికాదన్నారు. గత నాలుగేళ్లుగా బార్ టెండర్ల ప్రక్రియ ఆన్లైన్లోనే జరుగుతోందని, ఏ ఆధారంతో రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందని వారు చెబుతున్నారని విపక్షాలను ప్రశ్నించారు. టీఏఎస్ఎంఏసీ టెంబర్లో అవకతవకలకు ఆస్కారమే లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Bengaluru: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మహిళా కమిషన్కు ఫిర్యాదు.. విషయం ఏంటంటే..
Divya: నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.