Share News

Attention train passengers: మే 1 నుంచి రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్..

ABN , Publish Date - Apr 28 , 2025 | 05:21 PM

Attention train passengers: రైల్వే ప్రయాణికులకు పిడుగు లాంటి వార్త చెప్పింది రైల్వే శాఖ. ఇకపై మీరు రైల్వే రిజర్వేషన్ చేయించుకొని.. ఆ టికెట్ కన్ ఫార్మ్ కాకుంటే.. జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించాలని తెలిపింది. ఈ విధానం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

Attention train passengers: మే 1 నుంచి రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్..

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: రైల్వే ప్రయాణికులకు పిడుగు లాంటి వార్త చెప్పింది రైల్వే శాఖ. మీరు టికెట్ రిజర్వేషన్ చేయించుకొంటే.. ఆ టికెట్ వేయిటింగ్ లిస్టులో ఉండి కన్‌ఫార్మ్ కాకుంటే.. ఇకపై స్లీపర్‌లో కానీ, ఏసీ కంపార్ట్‌మెంట్‌లో కాని ప్రయాణించే వీలు లేదని రైల్వే శాఖ కుండబద్దలు కొట్టింది. ఇలా టికెట్ కన్‌ఫార్మ్ కాకుంటే.. వారంతా జనరల్ కంపార్ట్‌మెంట్‌లోనే ప్రయాణించ వలసి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విధానం మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది.

అయితే మరి ముఖ్యంగా ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రం బర్త్ కన్ ఫార్మ్ కాకుంటే.. టికెట్ ఆటోమెటిక్‌గా క్యాన్సిల్ అవుతోందని వెల్లడించింది. కానీ రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లో టికెట్ తీసుకున్న వారు మాత్రం.. సదరు టికెట్ క్యాన్సిల్ చేసుకోకుంటే మాత్రం జనరల్ కంపార్ట్‌మెంట్‌లోనే ప్రయాణించాలని తెలిపింది.


మరోవైపు.. గతంలో టికెట్ రిజర్వేషన్ చేయించుకొంటే.. అది కన్‌ఫార్మ్ కాకున్నా.. స్లీపర్ టికెట్ అయితే స్లీపర్‌లో.. ఏసీ టికెట్ అయితే.. ఏసీ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించే వీలుండేది. కానీ మే 1వ తేదీ నుంచి ఆ పరిస్థితి లేదని రైల్వే శాఖ తేల్చి చెప్పింది.

అదీకాక.. ఇలా టికెట్ కన్‌ఫార్మ్ కాకున్నా.. సదరు కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించడం వల్ల.. టికెట్ కన్ ఫార్మ్ అయిన ప్రయాణికులు పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లు రైల్వే శాఖకు ఫిర్యాదులు వెల్లవెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ విధంగా నిర్ణయం తీసుకొని ఉంటుందనే ఓ చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

Pahalgam Attack: దిద్దుబాటు చర్యలకు దిగిన కాంగ్రెస్ అధిష్టానం

AP Ministers: మార్చి నాటికి బందరు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి

Pahalgam Terror Attack: భరత్ భూషణ్ భార్య సుజాతను విచారించిన ఎన్ఐఏ

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం

Varanasi: వారణాసిలో కెనడియన్ అరెస్ట్.. ఎందుకంటే..

Hyderabad IT Corridor: బంగ్లాదేశ్ వాసి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

Pahalgam Terror Attack: పాకిస్థానీ యూట్యూబ్ చానెల్స్‌ను నిషేధించిన భారత్

Supreme Court: కేంద్ర ప్రభుత్వానికి, ఓటీటీలకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకంటే..

For National News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 05:34 PM