Share News

Air India Plane crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. ప్రాణాలతో బయటపడిన మృత్యుంజయుడు..

ABN , Publish Date - Jun 12 , 2025 | 08:12 PM

మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిరిండియా విమానం ఒక్కసారిగా కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. భారీ ప్రాణనష్టం సంభవించింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న అందరూ ప్రాణాలు కోల్పోయారని వార్తలు వచ్చాయి. అయితే ఒక్క వ్యక్తి అంత పెద్ద దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.

Air India Plane crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. ప్రాణాలతో బయటపడిన మృత్యుంజయుడు..
One miracle survivor on the flight

అహ్మదాబాద్‌ (Ahmedabad)లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన (Plane crash ) సంగతి తెలిసిందే. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. భారీ ప్రాణనష్టం సంభవించింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న అందరూ ప్రాణాలు కోల్పోయారని వార్తలు వచ్చాయి (Air India Plane crash). అయితే ఒక్క వ్యక్తి అంత పెద్ద దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.


అంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఆ వ్యక్తి పేరు విశ్వాస్ కుమార్ రమేష్. భారత సంతతికి చెందిన ఇతడికి బ్రిటన్ పౌరసత్వం ఉంది. భారత్‌లో ఉంటున్న తన కుటుంబ సభ్యులను కలిసేందుకు అతడు ఇటీవల ఇక్కడి వచ్చాడు. తిరిగి లండన్ వెళ్లేందుకు ఎయిరిండియా విమానం ఎక్కాడు. అతడు తన సోదరుడితో కలిసి ప్రయాణిస్తున్నాడు. ఆ సోదరుడి ఆచూకీ మాత్రం ఇప్పటివరకు లభ్యం కాలేదు. విశ్వాస్ ఎయిరిండియా విమానంలో సీట్ నెంబర్ 11Aలో కూర్చుని ప్రయాణిస్తున్నాడు.


హాస్పిటల్‌లో చికిత్స అనంతరం స్పృహలోకి వచ్చిన విశ్వాస్ ప్రమాదం తర్వాత తన పరిస్థితిని వివరించాడు. 'నాకు స్పృహ వచ్చే సరికి నా చుట్టూ మృతదేహాలున్నాయి. నాకు చాలా భయం వేసింది. నేను పైకి లేచి పరిగెత్తాను. ఎక్కడ చూసినా విమానం శిథిలాలే కనబడ్డాయి. నన్ను ఎవరో పైకి పట్టుకుని ఆంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్‌కు తీసుకొచ్చారు' అని విశ్వాస్ తెలిపాడు. విమానం జనావాసా ప్రాంతంలో పడడంతో మృతుల సంఖ్యపై ఇప్పటికింకా స్పష్టత లేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం.. ఆయన చివరి ఫొటో ఇదే..

లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా

For National News And Telugu News

Updated Date - Jun 12 , 2025 | 08:19 PM