Amit Shah: విమాన ప్రమాద ఘటనపై హామీ ఇచ్చిన.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:17 PM
అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా కుప్పకూలింది. విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. దీనిపై తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.
గుజరాత్ అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం అనేక మందిని షాక్కు గురిచేసింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171, లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరేందుకు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఫ్లైట్ క్రాష్ అయ్యింది. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉండగా, ఇప్పటివరకు 35 మందికిపైగా మరణించినట్లు తెలిసింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందన
ఈ ప్రమాదం జరిగిన వెంటనే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడి, రాష్ట్రానికి పూర్తి సహాయం అందించేందుకు హామీ ఇచ్చారు. అలాగే, అహ్మదాబాద్ పోలీసు కమిషనర్తో కూడా ఆయన మాట్లాడారు.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ చర్యలు
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే, గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి, గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రులకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. రక్షణ, సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
విమాన ప్రమాదం వివరాలు
ఈ ప్రమాదం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే జరిగింది. విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం టేకాఫ్ సమయంలో విమానం వెనుక భాగం చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందని అంటున్నారు. మరోవైపు విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పలువురు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎయిర్ ఇండియా ప్రమాదం ఫస్ట్ వీడియో
For National News And Telugu News