Share News

Breaking News: ఆ నాయకులపై చర్యలు.. టీపీసీసీ చీఫ్ క్లారిటీ

ABN , First Publish Date - Feb 05 , 2025 | 10:46 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: ఆ నాయకులపై చర్యలు.. టీపీసీసీ చీఫ్ క్లారిటీ
Breaking News

Live News & Update

  • 2025-02-05T15:29:08+05:30

    ఆ నాయకులపై చర్యలు.. టీపీసీసీ చీఫ్ క్లారిటీ

    • ఎంత చిన్నవాడైనా, పెద్ద వాడైనా పార్టీ క్రమశిక్షణకి లోబడి ఉండాలి

    • పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు

    • ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దు

    • కులగణన సర్వేను నీరుగార్జే యత్నం చేస్తున్నారు

    • కులగణన సర్వే పారదర్శకంగా జరిగింది

    • సర్వేలో ఎలాంటి అనుమానాలకు తావులేదు

    • సర్వేతో వాస్తవాలు బయటకొచ్చాయి

  • 2025-02-05T12:47:48+05:30

    వర్గీకరణలో కుట్ర.. మందకృష్ణ సంచలన వ్యాఖ్యలు

    • ఎస్సీ వర్గీకరణలో కొన్ని లోపాలున్నాయి

    • జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలి

    • జనాభాకు తగినట్లు రిజర్వేషన్లు ఇవ్వండి

    • మాదిగల జనాభా ప్రకారం రిజర్వేషన్ల వాటా రాలేదు

    • రెండు శాతం తక్కువ వచ్చింది

    • 11 శాతం ఉండాల్సింది.. 9శాతంగా ఉంది

    • లోపాలను వెంటనే సరిచేయాలి

  • 2025-02-05T12:09:29+05:30

    • ఉత్తరాంధ్ర వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

    • విశాఖపట్నం రైల్వే డివిజన్, విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించిన కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ.

    • వాల్తేర్ డివిజన్ పేరు విశాఖపట్నం డివిజన్‌గా మార్పు.

    • విశాఖ డివిజన్ పరిధి కూడా మారుస్తూ తాజా ఉత్తర్వులు.

    • కూటమి ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని తాజా ఉత్తర్వులు.

    • సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు.

    • రాయగడ రైల్వే డివిజన్ పరిధిని కూడా ఖరారు చేస్తూ ఉత్తర్వులు

    • విశాఖ డివిజన్‌లో 410 కిలోమీటర్ల పరిధిని చేర్చిన రైల్వే అధికారులు

    • కొండపల్లి-మొటుమర్రి సెక్షన్‌ను సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడ డివిజన్‌గా మార్చిన రైల్వే మంత్రిత్వ శాఖ.

  • 2025-02-05T12:01:06+05:30

    • త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించాక గంగా నదికి హారతి ఇచ్చారు మోడీ.

    • మహా కుంభ్‌కు తరలివచ్చిన అశేష ప్రజానీకానికి అభివాదం చేశారు మోడీ.

    • గంగా హారతి తర్వాత త్రివేణి సంగమం నుంచి ప్రయాగ్‌రాజ్‌కు మోడీ తిరుగు ప్రయాణమయ్యారు.

  • 2025-02-05T11:33:32+05:30

    • గంగా మాతకు ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    • త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించాక.. మోడీ ప్రత్యేక పూజలు చేశారు.

  • 2025-02-05T11:26:25+05:30

    • మహా కుంభమేళాలో మోడీ పవిత్ర స్నానం ఆచరించారు.

    • చేతితో రుద్రాక్ష మాలతో త్రివేణి సంగమంలో మునకలు వేశారు ప్రధాని.

  • 2025-02-05T11:18:26+05:30

    • పుణ్యస్నానం ఆచరించేందుకు సంఘం ఘాట్‌కు బోటులో బయల్దేరారు మోడీ.

    • కుంభమేళాకు వచ్చిన మోడీని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ఆయనతో పాటు బోటులో కూర్చొని సంగం ఘాట్‌కు బయల్దేరారు.

    • మోడీతో పాటు యోగి ఆదిత్యనాథ్ కూడా పవిత్ర స్నానం ఆచరించనున్నారు.

    • ఆల్రెడీ మహా కుంభ్‌లో ఒకమారు పుణ్య స్నానం ఆచరించిన యోగి ఆదిత్యనాథ్‌.. మరోమారు ప్రధానితో కలసి త్రివేణి సంగమంలో మునక వేయనున్నారు.

  • 2025-02-05T11:06:24+05:30

    • దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పొద్దున 7 గంటలకు పోలింగ్ మొదలైంది. తొలి గంటల్లోనే రాష్ట్రప్రతి ద్రౌపదీ ముర్ముతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.

    • బుధవారం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఓటింగ్‌లో 1.56 కోట్ల మంది ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

    • రాష్ట్రపతి ముర్ముతో పాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్, మరో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.

  • 2025-02-05T10:58:20+05:30

    • ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాకు విచ్చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు ఆయన ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్నారు.

    • ఉదయం 10 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్న మోడీ.. అక్కడి నుంచి అరైల్ ఘాట్‌కు పయనం అయ్యారు. ఆ ఘాట్ నుంచి బోటు మీద కుంభమేళా జరిగే ప్రాంతానికి ఆయన చేరుకుంటారు.

    • కుంభమేళా జరిగే ప్రాంతంలో మోడీ కేవలం గంట సేపు మాత్రమే ఉండనున్నారు. పుణ్యస్నానం ఆచరించాక, ప్రార్థనలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు.