-
-
Home » Mukhyaamshalu » Today Breaking News In Telugu Live Updates Friday 14 th February 2025 Suri
-

Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Feb 14 , 2025 | 12:42 PM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-02-14T18:04:53+05:30
దారుణం.. కన్న కుమారుడినే ముక్కలు ముక్కలుగా నరికిన తల్లి..
ప్రకాశం: కంభం పట్టణం తెలుగు వీధిలో దారుణం
కన్న కుమారుడినే ఓ కసాయి తల్లి హత్య చేయించిన ఉదంతం కలకలం రేపుతోంది
కదం శ్యామ్(35)ని ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేయించిన తల్లి సాలమ్మ
ఆటో డ్రైవర్ మోహన్తో కలిసి దారుణానికి ఒడికట్టిన సాలమ్మ
హత్య అనంతరం మేదర్ బజార్ సమీపంలోని పంట కాలువలో శరీర భాగాలను పడేసిన నిందితులు
శ్యామ్ను చంపేసిన తర్వాత మూడు గోనె సంచుల్లో శరీర భాగాలను పెట్టి పడవేసిన తల్లి సాలమ్మ
తన తమ్ముడిని హత్య చేయించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్యామ్ సోదరుడు సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ఆస్తి వివాదం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు
తల్లి సాలమ్మను, ఆటో డ్రైవర్ మోహన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
-
2025-02-14T15:27:42+05:30
మతప్రచారం చేస్తున్న ప్రిన్సిపల్.. ఆగ్రహించిన గ్రామస్థులు..
ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎంపీపీ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు మత ప్రచారాలు
పాఠశాలకు చెందిన హాజరుపట్టిక, మిడ్ డే మిల్స్, ఇతర పుస్తకాలలో ఓ మతానికి చెందిన వ్యాఖ్యలు రాస్తున్న ప్రిన్సిపల్
ఓ వర్గం దేవుళ్లని కించపరుస్తూ పాఠాలు బోధిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడిపై పెద్దఎత్తున వస్తున్న ఆరోపణలు
మధ్యాహ్న భోజనం బాగోవడం లేదని హెచ్ఏంకి ఫిర్యాదు చేస్తే కొడుతున్నారంటూ విద్యార్థులు ఆవేదన
ఆడపిల్లలతోనూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ ప్రిన్సిపల్పై విద్యార్థినిల తల్లిదండ్రులు మండిపాటు
మతపరమైన అంశాలు పిల్లలకి బోధిస్తున్నారంటూ తోటి ఉపాధ్యాయులు సైతం చెప్తున్న వైనం
పాఠశాలలో తమకు కనీసం ఫ్యాన్లు కూడా వేయడం లేదని ఆరోపిస్తున్న చిన్నారులు
విషయం తెలుసుకుని పెద్దఎత్తున పాఠశాల వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు
దీంతో పాఠశాలకు సెలవు పెట్టి అక్కడ్నుంచి వెళ్లిపోయిన ప్రధానోపాధ్యాయుడు
మండల విద్యాశాఖ అధికారికి చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్థుల ఆరోపణ
ప్రధానోపాధ్యాయుడికి ఎంఈవో సహకరిస్తున్నారని మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
గతంలోనూ ఇలానే జరిగిందని, ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రిన్సిపల్లో మార్పు రావడం లేదని ఆగ్రహం
-
2025-02-14T14:56:42+05:30
ఏసీబీ అధికారులకు చిక్కిన మరో అవినీతి తిమింగలం..
హైదరాబాద్: గచ్చిబౌలి ఏడీఈ కార్యాలయంపై దాడులు చేసిన ఏసీబీ అధికారులు
రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడిన గచ్చిబౌలి ఏడీఈ సతీశ్ రెడ్డి
ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేందుకు రూ.75 వేలు డిమాండ్ చేసిన గచ్చిబౌలి సతీశ్ రెడ్డి
ముందుగా రూ.25 వేలు ఇచ్చిన బాధితుడు.. అనంతరం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు
మిగతా రూ.50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుపడిన ఏడీఈ సతీశ్ రెడ్డి
-
2025-02-14T14:23:07+05:30
కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై నేడు కీలక ప్రజెంటేషన్ కార్యక్రమం..
కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సర్కార్
కులగణన, వర్గీకరణపై హైదరాబాద్ గాంధీ భవన్లో నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు కాంగ్రెస్ నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నేతలకు అవగాహన కార్యక్రమాలు
ప్రభుత్వం చేసిన కులగణన సర్వేపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
అలాగే ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి దామోదర రాజనర్సింహ
లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బీసీలకు ఇవ్వాల్సిన 42 శాతం రిజర్వేషన్పై దిశానిర్దేశం
హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు సహా హాజరుకానున్న పార్టీ శ్రేణులు
-
2025-02-14T14:06:57+05:30
పోర్న్ చిత్రాల మాదిరిగా రాత్రిళ్లు ఉండాలంటూ నవవధువుకు వేధింపులు
విశాఖ: గోపాలపట్నం పరిధిలో కలకలం రేపుతున్న నవవధువు ఆత్మహత్య
నీలిచిత్రాల వీడియోల్లో ఉండే విధంగా తనతో ఉండాలని భార్యను వేధించిన భర్త
సంసార జీవితం విషయంలో భార్యాభర్తల మధ్య పలుమార్లు తలెత్తిన వివాదాలు
ఇదే విషయమై వైద్యుల వద్దకు వెళ్లి కౌన్సెలింగ్ తీసుకున్న భార్యాభర్తలు
అయినా భర్త తీరులో మార్పు రాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన నవవధువు
భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బాధిత బంధువుల ఆరోపణ
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గోపాలపట్నం పోలీసులు
-
2025-02-14T13:51:11+05:30
యాసిడ్ దాడి బాధిత కుటుంబానికి వీడియో కాల్ చేసిన హోంమంత్రి..
అన్నమయ్య జిల్లా: గుర్రంకొండ మండలంలో యాసిడ్ దాడి ఘటనపై స్పందించిన ఏపీ హోంమంత్రి అనిత
పేరంపల్లికి చెందిన యువతిపై యాసిడ్ దాడిని తీవ్రంగా ఖండించిన హోంమంత్రి వంగలపూడి అనిత
సంబంధిత అధికారులను అడిగి బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన హోంమంత్రి
యువతి కుటుంబసభ్యులతో వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పిన హోంమంత్రి అనిత
మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన వంగలపూడి అనిత
యాసిడ్ దాడికి పాల్పడిన ఉన్మాదిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశం
-
2025-02-14T13:34:44+05:30
విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం..
తెలంగాణ విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహణ
ప్రతీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల స్థల సేకరణ, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం
వంద నియోజకవర్గాల్లో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి
నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపులు పూర్తయిన స్కూళ్ల అనుమతుల పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశం
ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించిన ముఖ్యమంత్రి
అనువైన స్థలం లేని చోట ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించిన రేవంత్ రెడ్డి
కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేసి వీలైనంత త్వరగా స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచన
రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి స్థలాల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి వారం రోజుల్లో రిపోర్ట్ అందించాలని ఆదేశం
స్థల సేకరణ జరిగిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో వంద శాతం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఆ స్థాయి ప్రమాణాలతో సరైన మౌలిక వసతులు కల్పించాలన్న ముఖ్యమంత్రి
ప్లే గ్రౌండ్, అకడమిక్ బ్లాక్, ఇతర సౌకర్యాలు సహా భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం
యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
-
2025-02-14T13:11:36+05:30
భారత్కు రానున్న మరో రెండు విమానాలు..
ఢిల్లీ: అమెరికా నుంచి ఇండియాకు శనివారం చేరుకోనున్న మరో రెండు విమానాలు
అక్రమ మార్గాల్లో అమెరికా వెళ్లిన భారతీయులతో రానున్న విమానాలు
ఇప్పటికే పంజాబ్ రాష్ట్రం అమృత్సర్కు చేరుకున్న మొదటి విమానం
మొదటి విమానంలో 104 మంది భారతీయులను తీసుకువచ్చిన అమెరికా అధికారులు
రానున్న రెండు విమానాల్లో దాదాపు 200 మంది భారతీయులు ఇండియాకు రాక
ఈనెల 15న చేరుకోనున్న 2వ విమానం, 16న చేరుకోనున్న 3వ విమానం
-
2025-02-14T12:57:29+05:30
వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం..
విజయవాడ: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు కేసులో కీలక పరిణామం
వల్లభనేని వంశీ ఆయనతోపాటు అరెస్ట్ అయిన మరో ఇరువురిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్
మరోవైపు బెయిల్ పిటిషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్న వంశీ తరఫు న్యాయవాదులు
ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉన్న వల్లభనేని వంశీని విడిపించేందుకు ప్రయత్నాలు
ఈ కేసులో మరికొందరు కీలక నిందితులు అరెస్ట్ కావాల్సి ఉందని చెబుతున్న పోలీసులు
గన్నవరం టీడీపీ కార్యాలయం విధ్వంసం కేసు ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్లో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు
కోర్టు కాంప్లెక్స్ వద్దకు సత్యవర్ధన్ను తీసుకువచ్చిన వాహనం, అందులో వచ్చిన వారి వివరాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సేకరించిన పోలీసులు
సత్యవర్ధన్ను విజయవాడలో ఎక్కడెక్కడ తిప్పారనే అంశంపైనా సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు
వంశీ అనుచరులే ఆ రోజున సత్యవర్ధన్ను తీసుకువచ్చారని నిర్ధారణకు వచ్చిన పోలీసులు
ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉండటంతో మిగతా వారి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు
గన్నవరం, విజయవాడలో వంశీ అనుచరులపై నిఘాపెట్టిన నగర పోలీసులు
తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఇప్పటికే ప్రకటించిన విజయవాడ సీపీ రాజశేఖరబాబు
-
2025-02-14T12:42:43+05:30
ప్రేమోన్మాది దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు..
అన్నమయ్య జిల్లా: పీలేరులో యువతిపై ప్రేమోన్మాది దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు
నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశం
గుర్రంకొండ మండలం పేరంపల్లిలో యాసిడ్ దాడిపై సీఎం తీవ్ర ఆగ్రహం
బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచన
యువతికి, ఆమె కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా