Share News

BREAKING: ఏపీలో ధాన్యం రైతులకు శుభవార్త

ABN , First Publish Date - Nov 01 , 2025 | 06:24 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

BREAKING: ఏపీలో ధాన్యం రైతులకు శుభవార్త

Live News & Update

  • Nov 01, 2025 21:08 IST

    అమరావతి: ఏపీలో ధాన్యం రైతులకు శుభవార్త

    • సోమవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు

    • రైతుల వివరాల నమోదుకు 7337359375 వాట్సాప్‌ నంబర్‌కు...

    • “Hi” అనే సందేశం పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచన

    • 2025-26 ఖరీఫ్‌లో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు నిర్ణయం

    • ఏపీవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు: మంత్రి నాదెండ్ల

    • ఏపీ వ్యాప్తంగా 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు: నాదెండ్ల

    • ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమయ్యేలా చర్యలు: నాదెండ్ల

  • Nov 01, 2025 18:33 IST

    యువత దేశాభివృద్ధికి కార్యోన్ముఖులు కావాలి: వెంకయ్యనాయుడు

    • మాతృభాష, భారతీయ సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వాలి: వెంకయ్య

    • వ్యక్తిత్వం మెరుగుదలకు యోగి వేమన బోధనలు మార్గదర్శకాలు: వెంకయ్యనాయుడు

    • జీవిత సత్యాల అవగాహనతో ఉన్నతమైన వ్యక్తిత్వం: వెంకయ్యనాయుడు

  • Nov 01, 2025 18:33 IST

    ఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం

    • వరంగల్: ఖానాపూర్‌లో స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం

    • ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హాసిఫ్‌(57) మృతి

    • ఖానాపూర్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న హాసిఫ్‌

  • Nov 01, 2025 16:35 IST

    కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన విచారకరం: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

    • బాధిత కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలిపారు: కిషన్‌ రెడ్డి

    • మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు: కిషన్‌ రెడ్డి

    • క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు: కిషన్‌ రెడ్డి

  • Nov 01, 2025 16:35 IST

    కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది: బండి సంజయ్‌

    • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం సాయం అందించాలి: బండి సంజయ్‌

    • తొక్కిసలాట దుర్ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలి: బండి సంజయ్‌

  • Nov 01, 2025 16:35 IST

    కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి ముందుకు సాగడం లేదు: కవిత

    • నిధులు తేకుండా బండి సంజయ్ ఏం చేస్తున్నారు?: కల్వకుంట్ల కవిత

    • కరీంనగర్‌లో గ్రానైట్ గుట్టలన్నీ కరిగిపోతున్నాయి: కల్వకుంట్ల కవిత

    • అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువ గుట్టలు తవ్వేస్తున్నారు: కవిత

    • కొందరి పేరు చెప్పడానికి బంధం అడ్డొస్తుంది: కల్వకుంట్ల కవిత

  • Nov 01, 2025 13:58 IST

    కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

    • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ

    • బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

    • మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

    • క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటన

  • Nov 01, 2025 13:33 IST

    కాశీబుగ్గ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది: మంత్రి లోకేష్

    • మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి: లోకేష్

  • Nov 01, 2025 13:32 IST

    కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై దేవాదాయశాఖ మంత్రి ఆనం వివరణ

    • ఘటన జరిగిన ఆలయం ప్రభుత్వ ఆధీనంలో లేదు: ABNతో మంత్రి ఆనం

    • ఇది పూర్తిగా ప్రైవేట్ ఆలయం: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

    • భక్తులు వేలాదిగా వచ్చినా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదు

    • 2వేల మంది కూడా పట్టని ఆలయంలోకి 30వేల మందిని అనుమతించారు

    • ఘటనకు నిర్వాహకుల వైఫల్యమే కారణం: ABNతో మంత్రి ఆనం

    • ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం: ఆనం

  • Nov 01, 2025 12:42 IST

    శ్రీకాకుళం కాశీబుగ్గ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

    • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం

    • తొక్కిసలాట ఘటన కలచివేసింది: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు

    • మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి: చంద్రబాబు

  • Nov 01, 2025 12:30 IST

    అమరావతి: ఆర్సెలార్ మిట్టల్‌కు కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం

    • అనకాపల్లిలో దేశంలోనే దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైన ఆర్సెలార్ మిట్టల్‌

    • 14 నెలల్లోనే భూమి, ప్రధాన అనుమతులు మంజూరు

    • ఏపీ ప్రభుత్వం వేగానికి ఎంతో ఆకర్షితులయ్యాం: ఆర్సెలార్ మిట్టల్‌ ఎండీ

  • Nov 01, 2025 12:12 IST

    శ్రీకాకుళం: కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట

    • 4మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

    • ఏకాదశి కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు

    • మృతుల సంఖ్య పెరిగే అవకాశం

  • Nov 01, 2025 11:57 IST

    ముంబై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

    • రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుకున్న DRI అధికారులు

    • కాఫీ పౌడర్‌లో డ్రగ్స్‌ కలిపి తరలించేందుకు యత్నం

    • సౌతాఫ్రికా నుంచి ముంబైకు డ్రగ్స్ తెచ్చిన ఐదుగురు సభ్యుల ముఠా

  • Nov 01, 2025 11:56 IST

    తెలంగాణ ఆగ్రో కార్పొరేషన్‌లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు

    • సమయ పాలన పాటించని సిబ్బందిపై మంత్రి తుమ్మల ఆగ్రహం

  • Nov 01, 2025 10:18 IST

    ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

    • బాంబు బెదిరింపుతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు

    • ముంబై ఎయిర్‌పోర్ట్‌కు విమానం మళ్లింపు

    • జెడ్డా నుంచి శంషాబాద్‌ వెళ్లాల్సిన విమానం

    • బెదిరింపు మెయిల్‌పై పోలీసులకు ఫిర్యాదు

  • Nov 01, 2025 10:18 IST

    అరకు, పాడేరు బస్సుల పునరుద్ధరణ

    • తుఫాన్ కారణంగా ఈ రెండు రూట్లో బస్సులను సోమవారం నుంచి రద్దు చేశారు..

    • తుఫాను తీవ్రత, వర్షాలు తగ్గడంతో బస్సులను పునరుద్ధరినించి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు

  • Nov 01, 2025 10:18 IST

    హైదరాబాద్: మియాపూర్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

    • సర్వే నెంబర్ 100లో భారీ భవనం నిర్మాణంపై ఫిర్యాదులు

    • అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న హైడ్రా, GHMC సిబ్బంది

  • Nov 01, 2025 10:17 IST

    ఢిల్లీలో కొనసాగుతోన్న వాయుకాలుష్యం

    • ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో సగటున 245 పాయింట్లు

    • BS 6 నిబంధనలు పాటించని వాణిజ్య వాహనాలపై నిషేధం

    • ఢిల్లీ ఎన్సీఆర్‌లో గ్రాప్-2 అమలు, నిర్మాణ పనులపై ఆంక్షలు

    • బొగ్గు, కట్టెల వాడకం, డీజిల్ జనరేటర్ సెట్లపై నిషేధం

  • Nov 01, 2025 09:49 IST

    బిహార్: జన్ సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌కిషోర్ కీలక వ్యాఖ్యలు

    • అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోం: ప్రశాంత్‌కిషోర్

    • బీఎస్పీకి 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి: ప్రశాంత్‌కిషోర్

    • ప్రజలు తిరస్కరిస్తే 10 కంటే తక్కువ సీట్లు సాధిస్తాం: ప్రశాంత్‌కిషోర్

  • Nov 01, 2025 08:43 IST

    ఎమ్మిగనూరు మండలం కోటెకల్‌ దగ్గర రోడ్డు ప్రమాదం

    • ఆటో-లారీ ఢీ, ఒకరు మృతి, 10 మంది కూలీలకు గాయాలు

    • ఆదోని మండలం కపటి నుంచి ఎమ్మిగనూరు వపంతుండగా ఘటన

  • Nov 01, 2025 08:42 IST

    విజయవాడ: కి'లేడీ' నిడిగుంట అరుణ బెదిరింపులు

    • కోర్టు బయట ఫిర్యాదు చేసిన వ్యక్తిపై అరుణ అరుపులతో హడావుడి

    • వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని..

    • రమేష్‌ నుంచి రెండు విడతలుగా రూ.24.50 లక్షలు వసూలు

    • అరుణ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో రమేష్ ఫిర్యాదు

    • అరుణను పీటీ వారెంట్‌పై విజయవాడ కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

    • బయటకి వచ్చాక నీ సంగతి చూస్తా అని రమేష్‌ను బెదిరించిన అరుణ

  • Nov 01, 2025 08:42 IST

    నేడు జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్‌రెడ్డి

    • నేడు బోరబండ, ఎర్రగడ్డలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం

  • Nov 01, 2025 08:41 IST

    గద్వాల: ధర్మవరం బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

    • రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు అస్వస్థత

    • 40 మంది విద్యార్థులకు వాంతులు, ఆస్పత్రికి తరలింపు

  • Nov 01, 2025 07:51 IST

    నేడు LVM3-M5 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్

    • రేపు సా.5:26కు రాకెట్ ప్రయోగం

    • CMS-03 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్న ఇస్రో

  • Nov 01, 2025 07:51 IST

    నేడు జూబ్లీహిల్స్‌లో ఏపీ మంత్రి సత్యకుమార్ ప్రచారం

    • బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా ఏపీ మంత్రి సత్యకుమార్

    • బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి తరఫున ప్రచారం చేయనున్న సత్యకుమార్

  • Nov 01, 2025 07:51 IST

    హైదరాబాద్: నేటి నుంచి పీజీ ఈసెట్ చివరి విడత కౌన్సెలింగ్

    • నవంబర్ 13, 15 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన

  • Nov 01, 2025 07:50 IST

    కర్నూలు బస్సు ప్రమాదంలో కీలకంగా మారిన రవాణాశాఖ కమిటీ నివేదిక

    • బస్సు ప్రమాదంపై నలుగురు సభ్యులతో సమగ్ర దర్యాప్తు

    • నిబంధనలు ఉల్లంఘించి ఏసీ స్లీపర్ బస్సుగా మార్చిన వి.కావేరి ట్రావెల్స్

    • బస్సులో అగ్నిమాపక యంత్రాలు లేవని గుర్తించిన కమిటీ సభ్యులు

    • నేడు దర్యాప్తు అధికారికి నివేదిక ఇవ్వనున్న ఆర్టీఏ కమిటీ సభ్యులు

  • Nov 01, 2025 06:24 IST

    నేడు సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    • పెద్దన్నవారిపల్లిలో పెన్షన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు

    • రాత్రి లండన్‌ పర్యటనకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు

  • Nov 01, 2025 06:24 IST

    నేడు ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని మోదీ పర్యటన

    • ఛత్తీస్‌గఢ్ రజత్ మహోత్సవంలో పాల్గొననున్న మోదీ

    • ఛత్తీస్‌గఢ్ విధానసభ కొత్త భవనం,..

    • వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

    • బ్రహ్మకుమారీస్ శాంతి శిఖర్‌ను ప్రారంభించనున్న మోదీ

  • Nov 01, 2025 06:24 IST

    ఈనెల 6న పాకిస్తాన్-అఫ్ఘనిస్తాన్ మధ్య చర్చలు

    • అఫ్ఘనిస్తాన్‌తో ఘర్షణలు పెంచుకునే ఉద్దేశం లేదన్న పాక్

    • రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు రంగంలోకి తుర్కియే, ఖతార్ దేశాలు