Share News

BREAKING: గ్రూప్‌-1 వివాదంపై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ

ABN , First Publish Date - Nov 03 , 2025 | 06:31 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

BREAKING: గ్రూప్‌-1 వివాదంపై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ

Live News & Update

  • Nov 03, 2025 21:36 IST

    ఘోరం.. మరో బస్సు ప్రమాదం..

    • ఏలూరు: లింగపాలెం జూబ్లీనగర్‌ దగ్గర ప్రైవేట్‌ బస్సు బోల్తా

    • ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

    • మృతుల సంఖ్య పెరిగే అవకాశం

    • ధర్మాజీగూడెం నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం

    • ప్రమాద సమయంలో బస్సులో 16 మంది ప్రయాణికులు

    • మద్యం మత్తులో బస్సు నడిపిన డ్రైవర్‌ ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయకచర్యలు

  • Nov 03, 2025 20:37 IST

    గ్రూప్‌-1 వివాదంపై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ

    • గ్రూప్-1 జవాబు పత్రాలను హాయ్‌ల్యాండ్‌కు.. తరలించాలనే నిర్ణయం ఎవరిదని ప్రశ్నించిన హైకోర్టు

    • జవాబు పత్రాలను హాయ్‌ల్యాండ్‌ నుంచి.. తిరిగి APPSCకి ఎప్పుడు తరలించారని హైకోర్టు ప్రశ్న

    • బిల్లుల చెల్లింపు వివరాలు తమముందు ఉంచాలన్న హైకోర్టు

    • జవాబు పత్రాలను సీల్డ్ కవర్‌లో అందజేయాలని APPSCకి ఆదేశం

    • తదుపరి విచారణ ఈనెల 11కి వాయిదా

  • Nov 03, 2025 20:37 IST

    నిర్మల్: లోకేశ్వరం మండలం వటోలిలో విషాదం

    • పురుగులమందు తాగి యువతి అఖిల ఆత్మహత్య

    • యువకుడు నరేష్‌ వేధింపులే ఆత్మహత్యకు కారణమని.. పోలీసులకు అఖిల కుటుంబ సభ్యులు ఫిర్యాదు

    • మనస్తాపంతో గోదావరిలో దూకి నరేష్‌ ఆత్మహత్య

  • Nov 03, 2025 20:37 IST

    అమరావతి: MSMEలపై ఉన్నతాధికారులతో మంత్రి కొండపల్లి సమీక్ష

    • MSME పార్కుల్లో మౌలిక వసతులపై దృష్టి సారించాలి: మంత్రి కొండపల్లి

    • పారిశ్రామిక రంగంలో పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: మంత్రి కొండపల్లి

    • తగిన కార్యాచరణ, భవిష్యత్‌ ప్రణాళికలతో ముందుకెళ్లాలి: మంత్రి కొండపల్లి

  • Nov 03, 2025 20:37 IST

    జూబ్లీహిల్స్‌లో బీజేపీకి 10 వేల ఓట్ల కంటే ఎక్కువ రావు: మంత్రి పొన్నం

    • తెలంగాణలో బీజేపీ వ్యవస్థను బీఆర్‌ఎస్‌కు అప్పగించేశారు: పొన్నం

    • పదేళ్లుగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి కిషన్‌రెడ్డి ఏం చేశారు?: పొన్నం

  • Nov 03, 2025 18:53 IST

    చేవెళ్ల బస్సు ప్రమాదంపై విచారణ వేగవంతం

    • కండక్టర్ రాధ ఫిర్యాదుతో చేవెళ్ల పోలీసులు కేసు నమోదు

    • టిప్పర్ డ్రైవర్‌ ఆకాష్‌పై 106(1) BNS కింద కేసు నమోదు

  • Nov 03, 2025 18:53 IST

    కూటమి ప్రభుత్వం నేరపూరిత స్వభావంతో పనిచేస్తోంది: సజ్జల

    • తప్పు చేసేవారిని కాపాడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది: సజ్జల

    • జోగి రమేష్‌పై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేశారు: సజ్జల

    • వారే తప్పులు చేసి ఎదుటివారిపై కేసులు పెడుతున్నారు: సజ్జల

    • జోగి రమేష్‌పై ప్రభుత్వం పెట్టిన కేసు కోర్టుల్లో నిలవదు: సజ్జల

    • కూటమి ప్రభుత్వం నేర స్వభావంతో పనిచేస్తోంది: సజ్జల

    • తప్పు చేసేవారిని కాపాడేలా ప్రభుత్వం తయారైంది: సజ్జల

    • జోగి రమేష్‌పై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారు: సజ్జల

    • వారే తప్పు చేసి ఎదుటి వారిపై కేసులు పెడుతున్నారు: సజ్జల

    • జోగి రమేష్‌పై పెట్టిన కేసు కోర్టుల్లో నిలవదు: సజ్జల

    • ఇలాంటి ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం: సజ్జల

    • పొలిటికల్‌ గవర్నెన్స్‌తో దుష్పరిణామాలు పెరిగాయి: సజ్జల

    • తిరుమల లడ్డూ ప్రసాదంలోనూ విష ప్రచారం చేశారు: సజ్జల

    • పల్నాడులో టీడీపీ వర్గాల గొడవల్లో ఇద్దరి హత్య జరిగితే.. వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులుపై కేసులు పెట్టారు: సజ్జల

    • సోషల్‌ మీడియా కార్యకర్త సవీంద్రపై గంజాయి కేసు పెట్టారు: సజ్జల

    • ఇష్టానుసారం అక్రమ కేసులు పెట్టి వేధింపులకు దిగారు: సజ్జల

    • మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు: సజ్జల

    • తుని ఘటనలో నిందితుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు: సజ్జల

    • ఆ బాలికను కాపాడిన వ్యక్తిపై కేసు పెట్టారు: సజ్జల

    • ఏపీ వ్యవస్థల్లో విచ్చలవిడితనం పెరిగిపోయింది: సజ్జల

  • Nov 03, 2025 18:53 IST

    ఇష్టం లేని పెళ్లి.. ఇంటికి నిప్పు..

    • సంగారెడ్డి: కుమార్తె ప్రేమ వివాహం నచ్చక యువకుడి ఇంటికి నిప్పు

    • ఝరాసంగం మండలం కక్కర్‌వాడలో యువకుడి తండ్రిపై దాడి చేసి.. ఇంటికి నిప్పు పెట్టిన యువతి తండ్రి, సోదరుడు

    • యువకుడు నగేష్‌ ఫిర్యాదుతో ఇద్దరు నిందితులపై కేసు నమోదు

  • Nov 03, 2025 18:53 IST

    స్వర్ణపురి కాలనీలో విషాదం..

    • సంగారెడ్డి: అమీన్‌పూర్‌ హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీలో విషాదం

    • స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులకు అస్వస్థత

    • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రజ్ఞ(9), ఆద్విక(8) మృతి

  • Nov 03, 2025 18:49 IST

    కులమతాల పేరుతో వైసీపీ విద్వేషాలు రెచ్చగొడుతోంది: మంత్రి లోకేష్‌

    • గూగుల్ పెట్టుబడులపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు: లోకేష్‌

    • డేటా సెంటర్‌తో విశాఖలో చెట్లు పెరగవని దుష్ప్రచారం చేశారు: లోకేష్‌

    • ఎన్నికల సమయంలోనే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధే ముఖ్యం రాష్ట్రాభివృద్ధి కోసం వైసీపీ ముందుకొస్తే కలిసి ముందుకెళ్తాం: లోకేష్‌

  • Nov 03, 2025 18:49 IST

    లండన్‌లో పారిశ్రామిక దిగ్గజాలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

    • హిందుజా గ్రూప్ భారత్‌ చైర్మన్ అశోక్ హిందుజాతో చంద్రబాబు సమావేశం

    • ఏపీలో పెట్టుబడుల అవకాశాలను వివరించిన సీఎం చంద్రబాబు

    • హిందూజా గ్రూప్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

    • ఏపీలో దశలవారీగా రూ.20 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని హిందూజా గ్రూప్ నిర్ణయం

    • విశాఖ హిందుజా పవర్ ప్లాంట్ సామర్ధ్యాన్ని.. మరో 1,600 మెగావాట్లకు పెంచేందుకు ఒప్పందం

    • రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు అంశంపై ఒప్పందం

    • కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్

    • ఏపీలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ ఏర్పాటుపై కుదిరిన ఒప్పందం

    • ఏపీలో గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ ఎకో సిస్టం అభివృద్ధికి సహకరించనున్న హిందూజా గ్రూప్

  • Nov 03, 2025 15:23 IST

    AIపై ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

    • కుంకీల నుంచి AI వరకు మానవ-వన్యప్రాణి మధ్య.. సంఘర్షణ నియంత్రణకు దారిచూపుతున్న ఏపీ: ఎక్స్‌లో పవన్‌కల్యాణ్‌

    • మానవ-వన్యప్రాణి సంఘర్షణను నియంత్రించేందుకు.. సరికొత్త సాంకేతిక వ్యవస్థ తీసుకొచ్చిన ఏపీ: పవన్‌కల్యాణ్‌

    • AI, మిషన్‌ లెర్నింగ్‌ విధానంతో పనిచేసే సరికొత్త వ్యవస్థ.. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో మోహరింపు: పవన్‌కల్యాణ్‌

  • Nov 03, 2025 15:22 IST

    రాజస్థాన్‌లో మరో ఘోర ప్రమాదం

    • లోహామండిలో బోల్తాపడిన ట్రాలీ

    • 10 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

    • హర్మదలో సికర్ రోడ్డు దగ్గర ప్రమాదం

  • Nov 03, 2025 13:44 IST

    లండన్‌లో పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్న ఏపీ సీఎం చంద్రబాబు

    • ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ అఫైర్స్, హిందుజా గ్రూప్‌తో సీఎం సమావేశం

    • రోల్స్ రాయస్ గ్రూప్, ఎస్రామ్, ఎమ్రామ్‌, శామ్కో కంపెనీతో సీఎం సమావేశం

    • లండన్‌లో పారిశ్రామికవేత్తలతో ఏపీ సీఎం రౌండ్ టేబుల్ సమావేశం

    • సీఎం చంద్రబాబుతో సాయంత్రం భేటీ కానున్న లండన్‌లో భారత హైకమిషనర్ విక్రమ్

  • Nov 03, 2025 13:44 IST

    MSME పార్కుల పురోగతిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సమీక్ష

    • MSME పార్కులలో మౌలిక సదుపాయాలు వేగంగా కల్పించాలి: మంత్రి శ్రీనివాస్

    • తొలి దశలో ఏర్పాటయ్యే MSME పార్కుల పురోగతిపై కొండపల్లి శ్రీనివాస్‌ చర్చ

    • ప్రతి నియోజకవర్గంలో మలివిడత పార్కులు ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష

    • పరిశ్రమలకు అనుమతుల జారీలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి ఆదేశం

  • Nov 03, 2025 13:44 IST

    భారత్‌ టెక్‌ హౌస్‌గా ఎదిగేందుకు ప్రైవేట్ పెట్టుబడులు ప్రోత్సహిస్తున్నాం: ప్రధాని మోదీ

    • దేశంలో ఆధునిక ఆవిష్కరణలు మరింత పెంచడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నాం

    • గతంతో పోలిస్తే దేశంలో పరిశోధన, అభివృద్ధి వ్యయం రెట్టింపు చేశాం: మోదీ

  • Nov 03, 2025 13:13 IST

    నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌, జోగి రాము అరెస్టుపై బెయిల్‌ పిటిషన్‌

    • మరోవైపు జోగి బ్రదర్స్‌ను కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్‌

  • Nov 03, 2025 13:12 IST

    వరంగల్: 6నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తూ మావోయిస్టుల లేఖ

    • భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో లేఖ

    • మరో 6నెలల పాటు కాల్పుల విరమణ కొనసాగిస్తున్నాం

    • ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం: మావోయిస్టు పార్టీ

  • Nov 03, 2025 13:12 IST

    చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం: సీపీ

    • నిర్మాణ పనుల కోసం కంకర లోడ్‌తో టిప్పర్ వెళ్తోంది: సీపీ అవినాష్

    • టిప్పర్ ఓనర్ వివరాలు సేకరిస్తున్నాం: సీపీ అవినాష్ మహంతి

    • ప్రమాదం సమగ్ర దర్యాప్తు చేస్తాం: సీపీ అవినాష్ మహంతి

  • Nov 03, 2025 11:52 IST

    చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలకు కొనసాగుతోన్న పోస్టుమార్టం

    • పోస్టుమార్టం నిర్వహిస్తున్న తాండూరు, వికారాబాద్, గాంధీ, ఉస్మానియా వైద్యులు

    • ఇప్పటివరకు మూడు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

    • నాగమణి మృతదేహాన్ని కర్ణాటకలోని భానూర్‌కు తరలింపు

    • నజీర్ అహ్మద్ మృతదేహాన్ని తాండూరుకు తరలింపు

    • తారిబాయి మృతదేహాన్ని గంగారం తండాకు తరలింపు

  • Nov 03, 2025 11:52 IST

    తాండూరుకు చెందిన కుటుంబంలో తీవ్ర విషాదం

    • ఒకే కుటుంబంలోని ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

    • మృతులు అనూష, సాయిప్రియ, నందిని

  • Nov 03, 2025 11:46 IST

    చేవెళ్ల బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

    • చేవెళ్ల బస్సు ప్రమాదం కలచివేసింది: సీఎం రేవంత్‌రెడ్డి

    • మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: రేవంత్‌

    • ఆర్టీసీ అందించే ఇన్సూరెన్స్‌తో పాటు..

    • బాధితులకు భరోసా ఇచ్చే అన్ని చర్యలు తీసుకుంటాం: రేవంత్

  • Nov 03, 2025 11:30 IST

    చేవెళ్ల ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

    • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని

    • మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం: మోదీ

    • క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం: మోదీ

  • Nov 03, 2025 11:30 IST

    చేవెళ్ల బస్సు ప్రమాద మృతుల వివరాలు

    • దస్తగిరి బాబా (బస్సు డ్రైవర్‌), తారిబాయ్‌ (45), కల్పన (45),..

    • బచ్చన్‌ నాగమణి (55), ఏమావత్‌ తాలీబామ్‌, మల్లగండ్ల హనుమంతు,..

    • గుర్రాల అభిత (21), గోగుల గుణమ్మ, షేక్‌ ఖలీద్‌ హుస్సేన్‌, తబస్సుమ్‌ జహాన్‌

  • Nov 03, 2025 11:28 IST

    చేవెళ్ల బస్సు ప్రమాదానికి కారణాలు

    • ఓవర్ లోడ్‌తో వస్తున్న టిప్పర్

    • అతివేగంగా ప్రయాణించిన టిప్పర్

    • రోడ్డుపై గుంతలు, అక్కడే మలుపు

    • ఢీకొట్టాక బస్సుపై పడిన టిప్పర్

    • కంకరపై టార్పాలిన్ కప్పకపోవడం

    • కంకర మొత్తం ప్రయాణికులపై పడడం

    • డ్రైవర్ సైడ్ 6 వరుసల్లో సీట్లను చీల్చేసిన టిప్పర్

    • 54 మందికి గానూ 70 మంది ఎక్కడంతో పెరిగిన మృతులు

  • Nov 03, 2025 11:14 IST

    ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు: మంత్రి పొన్నం

    • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా: పొన్నం

    • క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున పరిహారం: మంత్రి పొన్నం

    • ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం సరికాదు: పొన్నం

    • ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించాం: మంత్రి పొన్నం

    • చేవెళ్లలోనే అన్ని మృతదేహాలకు పోస్ట్‌మార్టం: పొన్నం

  • Nov 03, 2025 11:04 IST

    బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారు: మంత్రి పొన్నం ప్రభాకర్

    • మృతదేహాలకు పోస్టుమార్టం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతుంది

  • Nov 03, 2025 11:01 IST

    కాసేపట్లో చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనాస్థలికి సీఎం రేవంత్‌రెడ్డి

  • Nov 03, 2025 11:01 IST

    చేవెళ్ల బస్సు ప్రమాద మృతులందరికీ ఒకేచోట పోస్టుమార్టం

    • మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తున్న అధికారులు

    • ఉస్మానియా, గాంధీ ఫోరెన్సిక్ వైద్యులు పోస్టుమార్టంలో పాల్గొనాలని ఆదేశం

    • పోస్టుమార్టం నిర్వహించేందుకు గాంధీ నుంచి ఉస్మానియాకు వైద్యుల బృందం

    • క్షతగాత్రుల కోసం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు

  • Nov 03, 2025 10:49 IST

    చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాజకీయ నాయకులను నిలదీసిన మృతుల కుటుంబ సభ్యులు

    • ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేను నిలదీసిన మృతుల కుటుంబ సభ్యులు

    • మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి రోహిత్ రెడ్డి లకు నిరసన సెగ

    • MLA కాలే యాదయ్య పై రాళ్ళ తో దాడికి యత్నం

  • Nov 03, 2025 09:53 IST

    NH 163 అప్పా జంక్షన్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణం ప్రతిపాదన

    • చెట్లు ఎక్కువగా ఉండటంతో గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతుల జాప్యంతో నిర్మాణాలకు బ్రేక్

    • ఇప్పటివరకు ఖానాపూర్ రోడ్డుపై పలు ప్రమాదాల్లో 200 మంది మృతి, 600 మందికి గాయాలు

  • Nov 03, 2025 09:52 IST

    చేవెళ్ల బస్సు ప్రమాదంపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు

    • కంట్రోల్ రూమ్ నెం: 99129 19545, 94408 54433

  • Nov 03, 2025 09:52 IST

    చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

    • మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి: కేసీఆర్

  • Nov 03, 2025 08:49 IST

    సహాయక చర్యల్లో పాల్గొన్న చేవెళ్ల సీఐ కాళ్లపైకి ఎక్కిన జేసీబీ

    • సీఐ భూపాల్‌ శ్రీధర్‌ను చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలింపు

  • Nov 03, 2025 08:48 IST

    చేవెళ్ల బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

    • ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్

    • వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం

    • ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు తెలియజేయాలని సీఎం ఆదేశం

  • Nov 03, 2025 08:15 IST

    రంగారెడ్డి: చేవెళ్ల మండలం ఖానాపూర్ గేట్ దగ్గర రోడ్డుప్రమాదం

    • ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్, ఇద్దరు డ్రైవర్లు మృతి

    • టిప్పర్ కింద ఇరుకున్న బస్సు, పలువురికి తీవ్రగాయాలు

    • టిప్పర్‌లోని కంకర పడటంతో బస్సులో కూరుకుపోయిన ప్రయాణికులు

    • ఘటనాస్థలిలో జేసీబీతో కొనసాగుతోన్న సహాయక చర్యలు

    • ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు

    • చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్

    • ప్రమాదానికి గురైన తాండూరు డిపో బస్సు

  • Nov 03, 2025 08:15 IST

    నకిలీ మద్యం కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు

    • నకిలీ మద్యం కేసులో జనార్దన్‌తో జోగి సోదరులకు పరిచయం: రిమాండ్ రిపోర్ట్

    • ఇబ్రహీంపట్నంలోని స్వర్ణబార్ 2006-19 వరకు బాగా నడిచింది: రిమాండ్ రిపోర్ట్

    • బార్ లైసెన్స్ జోగి బంధువు బొర్రా అనిల్ కుమార్‌ పేరుపై ఉంది: రిమాండ్ రిపోర్ట్

    • 2017లో జోగి సోదరుల సహాయంతో ఇబ్రహీంపట్నంలో లిక్కర్ సిండికేట్ ఏర్పాటు

    • అద్దేపల్లి బ్రదర్స్ నుంచి జోగి బ్రదర్స్‌కు లావాదేవీలు జరిగినట్టు గుర్తింపు

    • జోగి బ్రదర్స్‌కు జనార్దన్ డబ్బు అందించినట్టు మురళీకృష్ణ స్టేట్‌మెంట్‌లో వెల్లడి

    • ములకలుచెరువులో మద్యం తయారీ ప్రారంభించాలని రమేష్ సూచించారు

    • నకిలీ మద్యంతో రాష్ట్రానికి రూ.9కోట్ల నష్టం జరిగింది: రిమాండ్ రిపోర్ట్

    • సెప్టెంబర్ 23న రమేష్ ఇంటికి జనార్దన్ వెళ్లి కుట్రపై చర్చలు జరిపారు: రిమాండ్ రిపోర్ట్

    • ప్రణాళిక అమలు చేస్తే రూ.కోట్లు అద్దేపల్లి బ్రదర్స్‌కు ఇస్తానని రమేష్ హామీ ఇచ్చారు

    • జోగి రమేష్ హామీతోనే జనార్దన్ ఆఫ్రికాకు వెళ్లారు: రిమాండ్ రిపోర్ట్

    • అక్టోబర్ 3న ములకలచెరువు నకిలీ మద్యంపై సమాచారం ఇచ్చారు: రిమాండ్ రిపోర్ట్

    • ఫలితం రాకపోవడంతో ఇబ్రహీంపట్నం మద్యం తయారీపై సమాచారం ఇచ్చారు

    • కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది: రిమాండ్ రిపోర్ట్

  • Nov 03, 2025 08:14 IST

    బాపట్ల: కర్లపాలెం మం. సత్యవతిపేట దగ్గర ఘోర రోడ్డుప్రమాదం

    • కారును ఢీకొట్టిన లారీ, నలుగురు మృతి, మరో ఇద్దరికి గాయాలు

    • మృతులంతా బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ బంధువులు

    • ఎమ్మెల్యే కుమారుడి సంగీత్‌కు వెళ్లి వస్తుండగా ఘటన

    • మృతులు: బలరామరాజు(65), లక్ష్మి(60), పుష్పవతి(60), శ్రీనివాసరాజు(54)

  • Nov 03, 2025 08:14 IST

    కోల్‌కతాలో మరో గ్యాంగ్‌ రేప్‌

    • ఇంటి నుంచి ట్యూషన్‌కు వెళ్లిన మైనర్‌పై అత్యాచారం

    • ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

  • Nov 03, 2025 08:13 IST

    నేడు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

    • SLBC కోసం ఏరియల్‌ ఎలక్ట్రో మాగ్నెటిక్‌ సర్వే

    • టన్నెల్‌ను పరిశీలించనున్న రేవంత్‌, ఉత్తమ్‌, జూపల్లి

    • NGRI ఆధ్వర్యంలో హెలికాప్టర్‌-బోర్న్‌ VTEM సర్వే

    • 200 కిలోమీటర్ల మేర హెలికాప్టర్‌ ఫ్లైయింగ్‌ షెడ్యూల్‌

    • భూమి అడుగున 1000 మీటర్ల లోతు వరకు డేటా సేకరణ

    • టన్నెల్‌ భద్రతకు సైన్స్‌ ఆధారిత మానిటరింగ్‌

  • Nov 03, 2025 07:16 IST

    నాగర్‌కర్నూల్‌: నేడు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన

    • అచ్చంపేట మండలం మన్నేవారిపల్లిలో నేడు సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

    • ఎన్జీఆర్ఐ బృందం SLBC టన్నెల్‌ పూర్తిచేసే ఇతర మార్గాల కోసం ఏరియల్ సర్వే

    • మధ్యాహ్నం ఒంటిగంటకు హెలికాప్టర్‌లో రానున్న సీఎం, మంత్రులు ఉత్తమ్‌, జూపల్లి

  • Nov 03, 2025 07:15 IST

    బ్రిటన్‌ కేంబ్రిడ్జ్‌షైర్‌లో అర్థరాత్రి దారుణ ఘటన

    • రైలులో పది మంది ప్రయాణికులపై కత్తులతో దాడి

    • రైలు బోగీ మొత్తం రక్తసిక్తం, బాధితులకు ఆస్పత్రిలో చికిత్స

    • దాడికి పాల్పడిన ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

    • లండన్‌లోని డాన్‌కస్టర్‌ నుంచి కింగ్స్‌ క్రాస్‌కో వెళ్తున్న రైలులో

  • Nov 03, 2025 07:15 IST

    తెలంగాణ: నేటి నుంచి ప్రైవేట్‌ కాలేజీలు బంద్‌

    • బకాయిలపై సీఎంవో అధికారులతో చర్చలు విఫలం

    • రూ.150 కోట్లు ఇస్తామన్నా అంకీకరించని యాజమాన్యాలు

    • రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి 1,840 ఉన్నత విద్యాసంస్థలు

    • జేఎన్‌టీయూ ఫార్మసీ సెమిస్టర్‌, ఇంజినీరింగ్‌ ఇంటర్నల్‌, బీఈడీ పరీక్షలు వాయి

  • Nov 03, 2025 07:15 IST

    హైదరాబాద్‌: రసవత్తరంగా జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక

    • ప్రత్యర్థి బలంగా ఉన్న బస్తీలపై పార్టీల ఫోకస్‌

    • మోహరించిన ప్రధాన పార్టీల పదాతి దళాలు

    • కీలకంగా రహ్మత్‌నగర్‌, ఎర్రగడ్డ, షేక్‌పేట

  • Nov 03, 2025 07:15 IST

    లండన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు

    • వ్యక్తిగత పర్యటనలో భాగంగా లండన్‌కు చంద్రబాబు దంపతులు

    • IOD సంస్థ నుంచి 2 ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోనున్న భువనేశ్వరి

    • సోమవారం వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీలు

  • Nov 03, 2025 07:14 IST

    బాపట్ల: కర్లపాలెం మం. సత్యవతిపేట దగ్గర ఘోర రోడ్డుప్రమాదం

    • కారును ఢీకొట్టిన లారీ, నలుగురు మృతి, మరో ఇద్దరికి గాయాలు

    • మృతులంతా కర్లపాలెం వాసులు, ఎమ్మెల్యే నరేంద్రవర్మ బంధువులు

    • ఎమ్మెల్యే కుమారుడి సంగీత్‌ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం

    • మృతులు: బేతాళం బలరామరాజు(65), బేతాళం లక్ష్మి(60)

    • మృతులు: గాదిరాజు పుష్పవతి(60), ముదుచారి శ్రీనివాసరాజు(54)

  • Nov 03, 2025 07:14 IST

    విజయవాడ: జోగి రమేష్, జోగి రాముకు రిమాండ్‌

    • నకిలీ మద్యం కేసులో ఇరువురికి ఈనెల 13 వరకు రిమాండ్‌

    • విజయవాడ జిల్లా జైలుకు తరలించిన అధికారులు

    • కేసులో A18 జోగి రమేష్‌, A19గా జోగి రాము

    • నకిలీ మద్యం కేసులో 23కు చేరిన నిందితుల సంఖ్య

    • ఇప్పటివరకు 18 మంది నిందితులు అరెస్ట్‌

  • Nov 03, 2025 07:14 IST

    భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది: ప్రధాని మోదీ

    • భారత మహిళల క్రికెట్‌ జట్టు చరిత్ర సృష్టించింది: సీఎం చంద్రబాబు

    • భారత మహిళల జట్టు సరికొత్త అధ్యాయం లిఖించింది: సీఎం రేవంత్ రెడ్డి

  • Nov 03, 2025 06:31 IST

    ఉమెన్స్‌ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ట్రోఫీ భారత్‌ కైవసం

    • ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం

    • 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై భారత్‌ గెలుపు

    • భారత్‌ 298/7, దక్షిణాఫ్రికా 246 ఆలౌట్‌

    • తొలిసారి వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత ఉమెన్స్‌ టీమ్

  • Nov 03, 2025 06:31 IST

    తెలంగాణ: నేటి నుంచి ప్రైవేట్‌ కాలేజీలు బంద్‌

    బకాయిలపై సీఎంవో అధికారులతో చర్చలు విఫలం

    రూ.150 కోట్లు ఇస్తామన్నా అంకీకరించని యాజమాన్యాలు