-
-
Home » Mukhyaamshalu » Andhra Pradesh Telangana national and International latest breaking news and live updates on 19th Dec 2025 vreddy
-
BREAKING: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..
ABN , First Publish Date - Dec 19 , 2025 | 08:27 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 19, 2025 21:47 IST
నితిన్ గడ్కరీతో ముగిసిన సీఎం చంద్రబాబు సమావేశం..
ఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ముగిసిన సీఎం చంద్రబాబు సమావేశం..
ఏపీలో జాతీయరహదారుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చ..
గ్రీన్ఫీల్డ్ నగరంగా అభివృద్ధి అవుతున్న అమరావతిని జాతీయరహదారులతో..
ప్రత్యక్ష, పరోక్ష నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కోరిన సీఎం చంద్రబాబు..
కృష్ణా నదిపై 6 లేన్ల ఐకానిక్ వంతెన నిర్మాణం కేంద్రమే చేపట్టాలని కోరిన సీఎం..
6 లేన్ల ఐకానిక్ కేబుల్ స్టెడ్ వంతెన మూలపాడు దగ్గర మూడు కీలకమైన జాతీయ రహదారులతో అమరావతిని అనుసంధానిస్తుందన్న చంద్రబాబు..
నేషనల్ హైవేస్ నెట్వర్క్ బలోపేతంలో గడ్కరీ కృషిని కొనియాడిన చంద్రబాబు..
జాతీయరహదారులు కనెక్టివిటీ, ఆర్ధిక ప్రగతికి సూచికగా నిలిచాయి: చంద్రబాబు.
-
Dec 19, 2025 21:41 IST
ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన
ఢిల్లీ: ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన..
మరికొద్ది సేపట్లో విజయవాడకు బయలుదేరనున్న సీఎం చంద్రబాబు.
-
Dec 19, 2025 21:34 IST
తెలంగాణలో ఉద్యోగులు, జర్నలిస్టులకు శుభవార్త..
EJHS వెల్నెస్ సెంటర్లలో వైద్య సేవలు విస్తరణ..
స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో దశలవారీ అందుబాటులోకి..
కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్స్ వైద్య సేవలు..
నిమ్స్ పరిధిలోకి కూకట్పల్లి, ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లు..
మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం పరిధిలోకి మరో 10 వెల్నెస్ సెంటర్లు..
వైద్యులు, సిబ్బంది నియామకం సహా ఆధునిక పరికరాలు..
టెస్టులు, చికిత్సలకు అవసరమైన సదుపాయాల ఏర్పాటుకు నిర్ణయం.
-
Dec 19, 2025 21:31 IST
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..
విశాఖ: పెందుర్తి సింహపురికాలనీలో రోడ్డుప్రమాదం..
వాహనాన్ని తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టిన బైక్..
ప్రమాదంలో ఆరేళ్ల కుమార్తె సహా దంపతులు మృతి..
మృతులు: దంపతులు కాంతారావు, సంధ్య, మహేశ్వరి(6)..
మృతులు శ్రీకాకుళం జిల్లా వాసులుగా గుర్తింపు.
-
Dec 19, 2025 21:29 IST
అమరావతిలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన మలేసియా కంపెనీలు..
ప్రజారాజధాని అమరావతి చేరుకున్న మలేసియా బృందం..
మలేసియా బృందంతో సమావేశమై రాజధాని అమరావతి నిర్మాణ పురోగతి గురించి వివరించిన అధికారులు..
అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని వివరించిన మలేసియా బృందం సభ్యులు.
-
Dec 19, 2025 21:25 IST
జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ చోరీ
రూ.3కోట్ల విలువ చేసే మిషనరీ ఇతర సామాగ్రి మాయం..
జీడిమెట్లలోని సూపర్ మ్యాక్స్ బ్లేడ్ కంపెనీ గత రెండేళ్లుగా మూతపడింది..
ఇదే అదునుగా భావించిన దొంగలు మిషనరీని ఎత్తుకెళ్లారు..
జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కంపెనీ ప్రతినిధులు..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
-
Dec 19, 2025 21:22 IST
అమిత్షాతో సీఎం చంద్రబాబు భేటీ..
తాజ్ ప్యాలెస్ హోటల్లో కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ..
ఏపీలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిపై చర్చ..
ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందనను అమిత్షాకు వివరించిన సీఎం చంద్రబాబు.
ఏపీలోని రాజకీయ పరిణామాలపై అమిత్ షా-చంద్రబాబు భేటీలో ప్రస్తావన..
అనంతరం క్రెడాయ్ నేషనల్ కాన్ క్లేవ్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు.
-
Dec 19, 2025 21:12 IST
అహ్మదాబాద్ టీ20: సౌతాఫ్రికా టార్గెట్ 232 పరుగులు
భారత్ స్కోర్- 231/5..
ఆఖరి టీ20లో సౌతాఫ్రికాపై చెలరేగిన భారత బ్యాటర్లు..
తిలక్ 73(42 బంతుల్లో), హార్దిక్ 63(25 బంతుల్లో..
సంజూ శాంసన్ 37, అభిషేక్ శర్మ 34 పరుగులు.
-
Dec 19, 2025 20:33 IST
5 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఐదు ప్రాజెక్టులు..
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఐదు ప్రాజెక్టులు..
ప్రకాశం, చిత్తూరు, పల్నాడు, తూ.గో., ప.గో.జిల్లాల్లో ప్రాజెక్టులు..
మొత్తం ప్రాజెక్టు విలువ : రూ. 7,910 కోట్లు..
వచ్చే 30 ఏళ్లలో 1.21 కోట్ల మంది దాహర్తి తీర్చడం లక్ష్యం..
ఇప్పటికే ప్రకాశం జిల్లాకు సంబంధించిన పనులకు మార్కాపురంలో శంకుస్థాపన..
రేపు ప.గో., తూ.గో., కాకినాడ, ఏలూరు, కోనసీమ జిల్లాల పరిధిలో శంకుస్థాపనలు.
-
Dec 19, 2025 20:28 IST
రాజమండ్రి పర్యటన ముగించుకొని ఎయిర్ పోర్టుకి చేరుకున్న లోకేష్ ..
ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకి బయలుదేరిన లోకేష్.
-
Dec 19, 2025 20:06 IST
డెక్కన్ కిచెన్ కూల్చివేతపై నాంపల్లి కోర్టు విచారణ..
ఈ కేసులో విచారణకు హాజరైన పిటిషనర్ నందకుమార్..
దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్, రానా, విశ్వనాథం హాజరు కాకపోవడంపై కోర్ట్ దృష్టికి తీసుకెళ్లిన నందకుమార్ తరుపు న్యాయవాది..
నందకుమార్ తరఫున న్యాయవాది కౌంటర్ దాఖలు
తదుపరి విచారణ జనవరి 9 వాయిదా.
-
Dec 19, 2025 20:01 IST
అత్యాచారం కేసు.. 25 ఏళ్ల జైలు శిక్ష..
సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు తీర్పు..
లైంగిక దాడి కేసులో నిందితుడు అర్జున్ కుమార్ జా అలియాస్ అర్జున్ పాండేకు 25 ఏండ్ల జైలు శిక్ష తోపాటు రూ.20వేల జరిమాన విధిస్తూ కోర్టు తీర్పు
బాధిత బాలికకు రూ.2 లక్షల నష్ట పరిహారం అందించాలని ఆదేశం.
-
Dec 19, 2025 19:52 IST
మోండా మార్కెట్లో అగ్ని ప్రమాదం..
హైదరాబాద్: మోండా మార్కెట్లోని శ్రీరామ ఎంటర్ప్రైజెస్ షాపులో అగ్ని ప్రమాదం..
మంటలను అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది..
అగ్ని ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్..
ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్న పోలీసులు.
-
Dec 19, 2025 19:48 IST
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఇదే..
2026 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు..
2026 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు.
-
Dec 19, 2025 19:37 IST
నార్సింగిలో మహిళ దారుణ హత్య
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..
తెలిసిన వ్యక్తే మహిళను హత్యచేసినట్టు అనుమానం..
మద్యం తాగేందుకు పిలిచి హతమార్చినట్టు సమాచారం.
-
Dec 19, 2025 19:32 IST
24న కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి..
ఈ నెల 24న కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి..
కొడంగల్లో గెలిచిన సర్పంచ్లతో ఆత్మీయ సమ్మేళనం..
సర్పంచ్లతో సీఎం ముఖాముఖి.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు..
ఒక ఫంక్షన్ హాల్లో సమావేశం కానున్న సీఎం..
సర్పంచ్లతో పాటు లంచ్ చేయనున్న సీఎం.
-
Dec 19, 2025 19:29 IST
జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు..
2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు: సీఎస్ విజయానంద్
అమరావతి: గోదావరి పుష్కరాలపై సీఎస్ అధ్యక్షతన కార్యదర్శుల కమిటీ భేటీ
పుష్కరాలకు ఇప్పటి నుంచే కట్టుదిట్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి: సీఎస్
-
Dec 19, 2025 19:27 IST
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
PACS చైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాలు రద్దు..
గత ఆగస్టు 14న ముగిసిన PACSల పదవీకాలం..
9 జిల్లాల డీసీసీబీలను తొలగిస్తూ ఉత్తర్వులు.
-
Dec 19, 2025 19:21 IST
రేపు కాంగ్రెస్ నిరసన వేదిక మార్పు..
హైదరాబాద్లో రేపు కాంగ్రెస్ నిరసన వేదిక మార్పు..
గాంధీ ఆస్పత్రి బదులు ప్యారడైజ్ దగ్గర చేపట్టాలని నిర్ణయం..
ఆస్పత్రికి వచ్చే రోగుల దృష్ట్యా వేదిక మార్చిన కాంగ్రెస్..
ఉపాధిహామీకి గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ నిరసన.
-
Dec 19, 2025 19:06 IST
అటల్ సందేశ్ యాత్ర బహిరంగ సభలో మాజీ ఉపరాష్ట్రపతి..
విజయనగరం: అటల్ సందేశ్ యాత్ర బహిరంగ సభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు..
ప్రజలు మెచ్చిన ప్రభువులు విజయనగరం, బొబ్బిలి రాజవంశీయులు..
సుపరిపాలనకు శ్రీకారం చుట్టిన మహానేత వాజ్పేయి..
దేశమంతా సమైఖ్యంగా ఉండాలని కోరుకున్న మహనీయుడు వాజ్పేయి..
దేశ అనుసంధానకర్త వాజ్పేయి.. పదవుల కోసం అడ్డదారులు తొక్కని నేత..
జనం చేత మాటపడకుండా నాయకులుండాలి.. బూతులు మాట్లాడే నేతలకు ఓటుతో బుద్ధి చెప్పాలి..
తమ ప్రత్యర్థి కుటుంబ సభ్యులను తిట్టే నీచ సంప్రదాయం కొందరు నేతలు అనుసరిస్తున్నారు: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
-
Dec 19, 2025 18:47 IST
U-19 ఆసియా కప్ ఫైనల్ చేరిన భారత్
తొలి సెమీస్లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో భారత్ విజయం..
స్కోర్లు: U-19 శ్రీలంక- 138/8, భారత్ 139/2..
రెండో సెమీస్లో బంగ్లాదేశ్పై పాక్ గెలుపు..
ఎల్లుండి U-19 భారత్ Vs పాక్ ఫైనల్ మ్యాచ్.
-
Dec 19, 2025 17:58 IST
శ్రీశైలం చేరుకున్న కేంద్ర ఎన్నికల కమిషనర్
నంద్యాల: శ్రీశైలం చేరుకున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్..
భ్రమరాంబ అతిథిగృహం వద్ద ఘనంగా ఆహ్వానం పలికిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, కలెక్టర్ రాజకుమారి, ఈఓ శ్రీనివాసరావు ఎస్పీ సునీల్ షెరాణ్..
శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకోనున్న భారత ఎన్నికల కమీషన్ జ్ఞానేష్ కుమార్ దంపతులు.
-
Dec 19, 2025 17:44 IST
రూ.300 కోట్లు మోసం.. కాకర్ల శ్రీనివాస్ అరెస్ట్..
ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో రూ.300 కోట్లు మోసం చేసిన కాకర్ల శ్రీనివాస్ అరెస్ట్..
జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కాకర్ల శ్రీనివాస్ను అరెస్ట్ చేసి ఈడీ అధికారులు
చెన్నైలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించిన ఈ డి అధికారులు..
ఈడీ కేసు నమోదు కాగానే పరారీ అయినా కాకర్ల శ్రీనివాస్..
ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో ఇంటి కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు..
డబ్బులు వసూలు చేసి ఇళ్లను ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాస్..
ఇప్పటివరకు రూ.300 కోట్ల రూపాయల వరకు మోసం చేసినట్లు గుర్తించిన ఈ డి.
మరికాసేపట్లో కోర్టులో శ్రీనివాసులు హాజరుపరచనున్న ఈడీ.
-
Dec 19, 2025 17:40 IST
నకిలీ కుల సర్టిఫికెట్తో సర్పంచ్ పదవి..
కామారెడ్డి: నకిలీ కుల సర్టిఫికెట్తో సర్పంచ్ పదవి
రాజంపేట మండలం అన్నారం సర్పంచ్ రవీందర్పై ఫిర్యాదు..
నకిలీ ఎస్టి కుల సర్టిఫికెట్తో సర్పంచ్గా గెలుపొందారని కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామస్తుల ఆందోళన..
జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏవోకి ఫిర్యాదు..
సర్పంచ్ పదవి నుండి తొలగించి మళ్ళీ ఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్.
-
Dec 19, 2025 17:16 IST
ఒడిశా సీఎంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ
ఒడిశా సీఎం మోహన్ చరణ్తో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ
నైనీలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుపై ఆలోచన చేస్తాం..
సాధ్యాసాధ్యాలపై స్టడీ కోసం తెలంగాణ అధికారుల బృందం నైనీ పర్యటనకు వస్తుంది.
ఎనర్జీ శాఖ ఆధ్వర్యంలో సాధ్యాసాధ్యాల నివేదిక తయారీ..
నివేదిక అనంతరం తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం.
-
Dec 19, 2025 17:14 IST
కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ ఎస్ పూరీని కలిసిన సీఎం చంద్రబాబు నాయుడు..
నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని కోరిన సీఎం..
రూ. 96,862 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద సమగ్ర ఇంధన ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్న సీఎం..
ఈ ప్రాజెక్ట్కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 6,000 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందించినట్టు వెల్లడి..
ప్రాజెక్ట్కు సంబంధించిన పబ్లిక్ హియరింగ్ విజయవంతంగా పూర్తైంది. పర్యావరణ అనుమతులు కూడా త్వరలోనే రానున్నాయి. ప్రాజెక్ట్ అన్ని దశల్లో వేగంగా ముందుకు సాగుతోంది..
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉద్యోగావకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి గణనీయమైన తోడ్పాటు లభించనుందని వివరించిన సీఎం చంద్రబాబు.
-
Dec 19, 2025 17:03 IST
కొకైన్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్..
కొకైన్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన నార్కోటిక్ అధికారులు..
నిందితుల దగ్గర నుండి 43 గ్రాముల కొకైన్,11.5 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు
నితిన్, శ్రానిక్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన నార్కిటిక్ పోలీసులు..
నిందితులు ఇద్దరు మలక్పేట్కు చెందిన వారిగా గుర్తింపు..
ముంబై నుండి డ్రగ్స్ తెప్పించుకొని సరఫరా చేస్తున్న నిందితులు..
నిందితులు ఇద్దరికీ ఆఫ్రికన్ చెందిన మహిళలు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తింపు..
నిందితుల్లో ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా, మరొకరు శానిటరీ షాపు యజమాని..
డ్రగ్స్ విక్రయాలతో పాటు సేవిస్తూన్న నిందితులు.
-
Dec 19, 2025 16:51 IST
బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖుల ఆస్తులు అటాచ్
ఢిల్లీ: బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ప్రముఖుల ఆస్తులు అటాచ్..
పీఎంఎల్ఏ కేసులో ప్రముఖుల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ అధికారులు..
నటులు సోనూసూద్, నేహాశర్మ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ..
మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప ఆస్తులు అటాచ్..
టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, నటి ఊర్వశి రౌతేలా తల్లి ఆస్తులు అటాచ్.
-
Dec 19, 2025 16:39 IST
కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
ఢిల్లీ: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి భేటీ అయిన సీఎం చంద్రబాబు నాయుడు
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ
-
Dec 19, 2025 16:35 IST
విజయ పాల డైరీ వద్ద హై టెన్షన్..
నంద్యాల: నంద్యాల విజయ పాల డైరీ వద్ద హై టెన్షన్..
ముత్యాలపాడు గ్రామంలో జరిగిన సొసైటీ ఎన్నికల్లో గెలిచిన భూమా విఖ్యాత్ రెడ్డి..
భూమా విఖ్యాత రెడ్డి డెయిరీకి ఉన్న అప్పును చెల్లించాలంటూ డిఫాల్టర్ నోటీసులు ఇచ్చిన డెయిరీ యాజమాన్యం..
వివరణ ఇవ్వడానికి డెయిరీ వద్దకు వచ్చిన భూమా విఖ్యాత్ రెడ్డి..
డెయిరీ యాజమాన్యం ఎవరు లేకపోవడంతో ఆగ్రహానికి వ్యక్తం చేసిన భూమా విఖ్యాత్ రెడ్డి.
-
Dec 19, 2025 15:49 IST
భారీగా నకిలీ రూ.500 నోట్లు సీజ్..
నిజామాబాద్: జిల్లాలో భారీగా నకిలీ రూ.500 నోట్లు
వర్నిలో రెండు లక్షలకు పైగా విలువ చేసే నకిలీ నోట్లు లభ్యం..
వర్ని మండలం జలాల్ పూర్ కు చెందిన నేరెడ్ల చిన్న సాయిలు అనే రైతు వర్ని లోని కెనరా బ్యాంకుకు తెచ్చిన డబ్బులో నకిలీ నోట్ల గుర్తింపు..
పంట రుణం కట్టేందుకు తెచ్చిన డబ్బు లెక్కిస్తుండగా వెలుగు చూసిన నకిలీ నోట్లు..
పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంకు మేనేజర్..
ఇంత భారీ మొత్తంలో నోట్లు రైతు వద్దకు ఎలా వచ్చాయో విచారణ చేపట్టిన పోలీసులు.
-
Dec 19, 2025 15:08 IST
జిళ్లుండ గ్రామంలో అగ్నిప్రమాదం..
శ్రీకాకుళం: మందస మండలం జిళ్లుండ గ్రామంలో అగ్నిప్రమాదం..
కొల్లి కృష్ణారావు అనే రైతుకి చెందిన 8 ధాన్యం బస్తాలు దగ్ధం..
పొలంలో వృథాగా పడివున్న వరిగడ్డికి గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటించడంతో చోటుచేసుకున్న ప్రమాదం.
మంటలను అదుపులోకి తీసుకొచ్చిన మందస అగ్నిమాపక సిబ్బంది
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాధిత కుటుంబం.
-
Dec 19, 2025 14:50 IST
కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి..
విజయవాడ: శుక్రవారం కావడంతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి..
ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి..
భవాని దీక్ష విరమణ సమయంలో వచ్చినట్టుగా భారీగా తరలి వచ్చిన భక్తులు..
త్వరగతిన దర్శన భాగ్యం కల్పిస్తున్న ఆలయ అధికారులు.
-
Dec 19, 2025 14:13 IST
మహిళ పుర్రె కలకలం..
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ పుర్రె కలకలం..
తిమ్మాయిపల్లి అటవీ ప్రాంతంలో మహిళా పుర్రె లభ్యం..
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..
చనిపోయిన మహిళ పుర్రె నాలుగు నెలల క్రితం ఉంటుందని భావిస్తున్న పోలీసులు.
-
Dec 19, 2025 13:32 IST
గుంటూరు: తాడేపల్లి పీఎస్కు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్
లోకేష్పై అనుచిత వ్యాఖ్యల కేసులో పీఎస్కు వచ్చిన గోరంట్ల
గోరంట్ల మాధవ్కు 41ఏ నోటీసులు ఇచ్చి పంపిన పోలీసులు
-
Dec 19, 2025 13:20 IST
ఢిల్లీ: కూటమి ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
40 నిమిషాలు ఎంపీలతో మాట్లాడిన చంద్రబాబు
సంక్షేమ పథకాలతో జగన్కి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి: సీఎం
మెడికల్ కాలేజీల PPP అంశం మాత్రమే వాళ్లకి దొరికింది: చంద్రబాబు
PPP అంశంలో కూడా ప్రజలు వాళ్లకి అవకాశం ఇవ్వలేదు
కోటి సంతకాల పేరుతో డ్రామా చేయాలని చూస్తే అదీ విఫలం: చంద్రబాబు
-
Dec 19, 2025 13:20 IST
మేడ్చల్: ఘన్పూర్ మెడిసిటీ ఆస్పత్రిలో దారుణం
మహిళకు అపరేషన్ చేస్తూ మధ్యలో వదిలేసిన వైద్యులు
సరైన పరికరాలు లేవని చేతులెత్తేసిన డాక్టర్లు
మహిళను మరో ఆస్పత్రికి తీసుకెళ్లమని ఒత్తిడి
ఆస్పత్రి దగ్గర ఆందోళనకు దిగిన మహిళ బంధువులు
హెర్నియా సమస్యతో బాధపడుతున్న మహిళ పుష్పలత
-
Dec 19, 2025 12:55 IST
జమ్మూకశ్మీర్: రాజౌరీలో ఉగ్ర కదలికలు
భారీగా గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు
-
Dec 19, 2025 12:50 IST
సీఎం రేవంత్ను కేటీఆర్ విమర్శిస్తే నాలుక కోస్తాం: బీర్ల ఐలయ్య
తండ్రి చాటుగా వచ్చి కేటీఆర్ ఎమ్మెల్యే, మంత్రి అయ్యారు
సొంతంగా పోటీ చేసి గెలిచే దమ్ము కేటీఆర్కు లేదు: బీర్ల ఐలయ్య
కేటీఆర్కు దమ్ముంటే నల్లగొండ జిల్లాలో పోటీ చేసి గెలవాలి
BRSలో గెలిచిన సర్పంచ్లను కాంగ్రెస్లో చేర్చుకోం: బీర్ల ఐలయ్య
-
Dec 19, 2025 12:49 IST
ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితుల రిమాండ్ పొడిగింపు
జనవరి 2వరకు రిమాండ్ పొడిగించిన విజయవాడ ACB కోర్టు
-
Dec 19, 2025 12:00 IST
గ్రీన్కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ను సస్పెండ్ చేసిన ట్రంప్
బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులు జరిపిన వ్యక్తి..
గ్రీన్కార్డ్ ద్వారానే అమెరికాలోకి రావడంతో చర్యలు
నేచురలైజ్డ్ అమెరికన్ పౌరసత్వాలను రద్దు చేసే యోచనలో ట్రంప్
-
Dec 19, 2025 11:43 IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావు కస్టడీ మరో వారం పొడిగింపు
ఈనెల 26న కస్టడీ నుంచి ప్రభాకర్రావును విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
వారం రోజుల కస్టోడియల్ విచారణ రిపోర్ట్ను సుప్రీంకోర్టుకు అందజేసిన సిట్
తదుపరి విచారణ వరకు ఎలాంటి వ్యతిరేక చర్యలు తీసుకోవద్దన్న సుప్రీంకోర్టు
దర్యాప్తునకు సహకరించాలని ప్రభాకర్రావును ఆదేశించిన సుప్రీంకోర్టు
-
Dec 19, 2025 11:06 IST
ఛత్తీస్గఢ్: బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్, మావోయిస్టు మృతి
ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఘటన
-
Dec 19, 2025 11:06 IST
ఢిల్లీ: మ.2గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ
పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
-
Dec 19, 2025 11:05 IST
జల్జీవన్ మిషన్ అమలుకు ఏపీకి అదనంగా రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి
జల్జీవన్ మిషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.524.41 కోట్లు ఖర్చు
కేంద్ర వాటా నిధులను విడుదల చేయాలని కోరిన సీఎం చంద్రబాబు
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY) – RRR పథకం కింద..
చెరువులు, కాలువల పునరుద్ధరణకు ఏపీ ప్రతిపాదనలు సిద్ధం: చంద్రబాబు
కేంద్రం వాటా నిధులు విడుదల చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో..
సాగునీటి సామర్థ్యం పెంచుకునేందుకు అవకాశం: చంద్రబాబు
-
Dec 19, 2025 11:05 IST
ఢిల్లీ: కేంద్ర మంత్రి CR పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు, వివిధ పథకాలకు నిధులపై చర్చ
ఇప్పటికే ఆమోదించిన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలి: చంద్రబాబు
పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలి: చంద్రబాబు
ఏపీకి నీటి భద్రత అత్యంత కీలక అంశం: చంద్రబాబు
ఏపీ సాగునీటి-తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని..
కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి
ప్రాజెక్టులపై కేంద్ర–రాష్ట్ర సమన్వయం మరింత అవసరం: చంద్రబాబు
-
Dec 19, 2025 09:57 IST
ఇస్రో 100వ ప్రయోగానికి ముహూర్తం ఖరారు
ఈ నెల 24న LVM 03 M6 రాకెట్ ప్రయోగం
అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ శాటిలైట్ను పంపనున్న శాస్త్రవేత్తలు
-
Dec 19, 2025 08:29 IST
నంద్యాల: నందికొట్కూరులో చాక్లెట్ల కలకలం
ప్రభుత్వ పాఠశాలలో చాక్లెట్లు తిని 11 మంది విద్యార్థినిలకు అస్వస్థత
స్కూల్లో చాక్లెట్లు పంపిణీ చేయాలని ఏడో తరగతి విద్యార్థినికి ప్యాకెట్ ఇచ్చిన అగంతకుడు
పీఈటీ టీచర్తో పాటు పలువురు విద్యార్ధినిలకు చాక్లెట్లు పంపిణీ
కనురెప్పలు నల్లగా మారడం, కడుపు నొప్పి, వాంతులు ఇబ్బంది పడుతున్న విద్యార్థినీలు
ఆలస్యంగా వెలుగులోకి ఘటన, కేసు నమోదు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
-
Dec 19, 2025 08:27 IST
ఆదిలాబాద్: చలి తీవ్రతతో స్కూళ్ల సమయాల్లో మార్పులు
40 నిమిషాలు ఆలస్యంగా తెరుచుకోనున్న స్కూళ్లు
ఉ.9:40 నుంచి సా.4:30 వరకు పాఠశాలలు
-
Dec 19, 2025 08:27 IST
వరంగల్: నర్సంపేటలోని గిరిజన పాఠశాల, కళాశాలలో ఘర్షణ
9వ తరగతి విద్యార్థులను చితకబాదిన ఫస్టియర్ స్టూడెంట్స్
ఒకరి పరిస్థితి విషమం, మరో ఇద్దరి పరిస్థితి విషమం