Montha Cyclone Safety Tips: తుఫాను సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ABN , Publish Date - Oct 29 , 2025 | 02:12 PM
ఏపీలో మొంథా తుపాన్ బీభత్సం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ తుఫాను సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: మొంథా తుపాన్ తీరం దాటడంతో కోనసీమ అతలాకుతలమవుతోంది. అంతేకాకుండా, పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి, మొంథా తుఫాను సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ముందుగా ప్రశాంతంగా ఉండండి. ఏం జరుగుతుందోననే భయం పెట్టుకోవద్దు.
ఇళ్లలో నుండి బయటకు రావద్దు.
ముందు జాగ్రత్తగా మీ సెల్ ఫోన్లకు ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకోండి.
రేడియో, టీవీల ద్వారా ఎప్పటికప్పుడు తుఫాన్కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోండి.
ముఖ్యమైన డాక్యుమెంట్లు తడిచిపోకుండా జాగ్రత్తగా తీసి పెట్టుకోండి.
పదునైన వస్తువులను ఎక్కడపడితే అక్కడ పడేయకండి.
ఎమర్జెన్సీ కిట్ను ముందే సిద్ధంగా ఉంచుకోండి.
నిల్వ ఉండే ఆహారాన్ని సిద్ధం చేసుకోండి.
బ్యాటరీలతో పని చేసే టార్చిలైట్లను దగ్గరగా పెట్టుకోండి.
తుఫాను తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వేడి చేసిన నీటిని మాత్రమే తాగండి.
అధికారికంగా సమాచారం వచ్చేవరకూ ఎట్టి పరిస్థితిలోనూ బయటకు రాకండి.
పునరావాస కేంద్రాల్లో ఉన్నవారు అధికారులు చెప్పే వరకూ ఇంటికి వెళ్లొద్దు.
సాధ్యమైనంత వరకూ షూ వేసుకోవడం మంచిది.
విరిగిన స్తంభాలు, విద్యుత్ తీగల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి.
తడిచిన గోడలు, దెబ్బతిన్న ఇళ్లు, భవనాల్లోకి అస్సలు వెళ్లొద్దు.
ఎలక్ట్రికల్ పరికరాలు ఉపయోగించే ముందు ఎలక్ట్రిషియన్ తో చెక్ చేయించడం చాలా మంచిది.
పొలాల్లోకి వెళ్లేటప్పుడు పాములు, ఇతర కీటకాల పట్ల అప్రమత్తంగా ఉండండి.
ఒరిగిన చెట్ల కిందికి అస్సలు వెళ్లకండి.
ఇవి కూడా చదవండి...
యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి.. డిప్యూటీ సీఎం ఆదేశం
శ్రీశైలంలో కుండపోత వర్షం.. విరిగిపడ్డ కొండచరియలు
Read Latest AP News And Telugu News