Donald Trump: నా ఫ్రెండ్ మోదీకి యూఎ్సఎయిడ్
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:14 AM
భారత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవల్పమెంట్(యూఎ్సఎయిడ్) రూ.182 కోట్లు(21 మిలియన్ డాలర్లు) ఇవ్వడంపై రాజకీయ రచ్చ జరుగుతుండగా..

ఎక్స్లో పోస్టు చేసిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్, ఫిబ్రవరి 22: భారత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవల్పమెంట్(యూఎ్సఎయిడ్) రూ.182 కోట్లు(21 మిలియన్ డాలర్లు) ఇవ్వడంపై రాజకీయ రచ్చ జరుగుతుండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈసారి ఏకంగా ప్రధాని మోదీ పేరును ప్రస్తావించారు. ‘‘నా మిత్రుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీకి 21 మిలియన్ డాలర్లు వెళ్తున్నాయి. మేము భారత్లో ఓటింగ్ శాతం పెరగడానికి ఈ మొత్తం ఇస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలోనే ఈ నిధులు వచ్చాయని బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకొంది. భారత ఎన్నికల్లో జోక్యానికి బైడెన్ హయాంలో ఈ ఫండ్ ఇచ్చారని ట్రంప్ నాలుగు రోజుల క్రితం ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..
Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు
Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.