Share News

UN Urges: భారత్‌-పాక్‌ సంయమనం పాటించాలి

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:02 AM

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలపై యూఎన్‌ ప్రధాన కార్యదర్శి గుటెరెస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దేశాలు సంయమనం పాటించి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించార

UN Urges: భారత్‌-పాక్‌ సంయమనం పాటించాలి

  • ఉగ్రదాడి నేపథ్యంలో యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ స్పందన

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 25: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటొనియో గుటేరస్‌ ఆందోళన వ్యక్తంచేశారు. రెండు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. గుటేరస్‌ తరపున ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ మీడియాతో మాట్లాడారు. తాజా పరిణామాలను గుటేరస్‌ నిశితంగా పరిశీలిస్తున్నారని, ఏ సమస్య తలెత్తినా రెండు దేశాలు చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారని వెల్లడించారు.

Updated Date - Apr 26 , 2025 | 04:02 AM