Pak Earthquake: పాక్లో భూకంపం.. వారంలో ఇది రెండోసారి
ABN , Publish Date - May 05 , 2025 | 07:27 PM
ఒకవైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ పాక్ వరుస భూకంపంలతో వణుకుతోంది. తాజాగా సోమవారం మరోసారి పాకిస్థాన్ను భూకంపం వణికించింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో పాకిస్థాన్లో భూమి కంపించిట్టు నేషనల్ సెంటర్ ఫర్ సస్మాలజీ (NCS) తెలిపింది. పాకిస్థాన్లో వారం రోజుల వ్యవధిలో భూకంపం సంభవించడం ఇది రెండోసారి.
Pak Missile Test: రెండోసారి క్షిపణి పరీక్ష నిర్వహించిన పాక్
దీనికిముందు, ఏప్రిల్ 30న 4.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు ఎన్ఎస్జీ ప్రకటించింది. ఏప్రిల్ 12న కూడా 5.8 తీవ్రతతో పాకిస్థాన్లో భూకంపం సంభవించింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ పదేపదే తూట్లు పొడుస్తూ వరుసగా 11వ రోజు కూడా కాల్పులకు తెగబడంపై భారత్ గుర్రుగా ఉంది. అణ్వస్త్ర బూచి చూపించి పాక్ అధికార పక్ష నేతలు గంభీర ప్రకటనలు చేస్తున్నప్పటికీ దాయాది దేశం ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో వారంలో రెండో భూకంపం సంభవించడంతో పాక్ ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
ఇవి కూడా చదవండి..