Share News

Hyderabad: మెడికల్‌ సీట్ల పేరుతో రూ. 2 కోట్ల మోసం

ABN , Publish Date - Apr 30 , 2025 | 10:00 AM

కళాశాలల్లో మెడికల్‌ సీట్లు ఇప్పిస్తానని దాదాను రూ. 2 కోట్లు వసూలు చేసిన ఘరాకా మోసగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగర శివారు హయత్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రకాంత్‌ అనే వ్యక్తి ప్రముఖ కళాశాలల్లో మెడికల్‌ సీట్లు ఇప్పిస్తానని రూ. 2కోట్ల మేర వసూలు చేశాడు. ప్రస్తుతం ఇతను పోలీసుల అదుపులో ఉన్నాడు.

Hyderabad: మెడికల్‌ సీట్ల పేరుతో రూ. 2 కోట్ల మోసం

- పోలీసుల అదుపులో నిందితుడు

హైదరాబాద్: మెడికల్‌ సీట్లు ఇప్పిస్తానని విద్యార్థుల నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేసిన యువకుడిని హయత్‌నగర్‌(Hayath Nagar) పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రముఖ కళాశాలల్లో మెడికల్‌ సీట్లు ఇప్పిస్తానని చంద్రకాంత్‌(Chandrakanth) అనే యువకుడు పలువురి నుంచి రూ.2 కోట్ల మేరకు వసూలు చేశాడు. సీట్లు ఇప్పించకపోవడం, డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఓ బాధితుడు శ్రీనివాస్‌ హయత్‌నగర్‌ పోలీసులకు సమాచారమందించాడు. దీంతో హయత్‌నగర్‌ పోలీసులు చంద్రకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. మోసం చేసిన విషయం వాస్తవమేనని, పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Special trains: చర్లపల్లి నుంచి తిరుపతికి మరో 8 ప్రత్యేక రైళ్లు


వార్తలు కూడా చదవండి

Cyber Fraud: నయా సైబర్‌ మోసం.. ఆర్మీ పేరుతో విరాళాలకు విజ్ఞప్తి

మెట్రో స్టేషన్లు, రైళ్లలో.. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారంపై కట్టడి


city5.2.jpg

NHAI: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు!

మహిళపై చేయిచేసుకున్న పోలీస్

Read Latest Telangana News and National News

Updated Date - Apr 30 , 2025 | 10:00 AM