Share News

Bengaluru News: చెత్తకుప్పలో పుర్రె, ఎముకలు

ABN , Publish Date - Aug 27 , 2025 | 11:42 AM

ధర్మస్థళలో పుర్రె వివాదం సంచలనం కలిగిస్తుండగా నగరంలోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని గోవిందశెట్టిపాళ్య చెత్తకుప్పలో మనిషి పుర్రెతోపాటు ఎముకలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం ఉదయం స్థానికులు గమనించి పరప్పన అగ్రహార పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Bengaluru News: చెత్తకుప్పలో పుర్రె, ఎముకలు

బెంగళూరు: ధర్మస్థళలో పుర్రె వివాదం సంచలనం కలిగిస్తుండగా నగరంలోని ఎలక్ట్రానిక్‌ సిటీ(Electronic City) సమీపంలోని గోవిందశెట్టిపాళ్య చెత్తకుప్పలో మనిషి పుర్రెతోపాటు ఎముకలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం ఉదయం స్థానికులు గమనించి పరప్పన అగ్రహార పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు రంగంలోకి దిగి వాటిని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారం భించారు.


pandu1.2.jpg

అయితే ఓ మెడికల్‌ విద్యార్థి పరీక్షలు చేసేందుకు తీసుకొచ్చి వాటిని చెత్తకుప్పలో పడేసినట్టు గుర్తించారు. విద్యార్థిని తండ్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎముకలు పడేసింది నేనే అంటూ అంగీకరించారు. అయితే ఎముకలు, పుర్రె కనిపించగానే హత్య జరిగి ఉండవచ్చునని, చేతబడి చేసేందుకు తీసుకొచ్చి ఉంటారనే కథనాలు ప్రచారమైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

అందుకే యూరియా ఆలస్యమైంది

మంత్రి ఉత్తమ్‌‌కు హరీష్ రావు సంచలన లేఖ

Read Latest Telangana News and National News

Updated Date - Aug 27 , 2025 | 11:42 AM