Share News

రూ 5 లక్షల కోట్ల నష్టం

ABN , Publish Date - May 09 , 2025 | 04:45 AM

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో ఈక్విటీ మదుపరులు అప్రమత్తమై అమ్మకాలకు పాల్పడ్డారు. దాంతో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాలు చవిచూశాయి...

రూ 5 లక్షల కోట్ల నష్టం

సెన్సెక్స్‌ 412 పాయింట్లు పతనం

ముంబై: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో ఈక్విటీ మదుపరులు అప్రమత్తమై అమ్మకాలకు పాల్పడ్డారు. దాంతో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్‌ 411.97 పాయింట్లు కోల్పోయి 80,334.81 వద్దకు జారుకుంది. ఆరంభంలో స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు పరిమిత శ్రేణిలోనే కదలాడాయి. మధ్యాహ్నం నుంచి ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆటో షేర్లలో లాభాల స్వీకరణకు దిగటంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్‌ చివర్లో సెన్సెక్స్‌ 759 పాయింట్లు పతనమై 80,000 దిగువకు పడిపోయినప్పటికీ.. వెంటనే తేరుకుంది. నిఫ్టీ విషయానికొస్తే, ఇంట్రాడేలో 264.2 పాయింట్ల వరకు క్షీణించిన సూచీ.. చివరికి 140.60 పాయింట్ల నష్టంతో 24,273.80 వద్ద స్థిరపడింది. అమ్మకాల హోరులో ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.5 లక్షల కోట్లకు పైగా తగ్గి రూ.418.50 లక్షల కోట్లకు (4.93 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 21 నష్టపోయాయి.

  • ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 81 పైసల నష్టంతో రూ.85.58 వద్ద ముగిసింది. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్లో నష్టాలు ఇందుకు ప్రధాన కారణమయ్యాయి. రూపాయికి రెండున్నర ఏళ్లకు పైగా కాలంలో ఇదే అతిపెద్ద ఒక్కరోజు క్షీణత.

ఈ వార్తలు కూడా చదవండి

Operation Sindoor: జమ్మూకాశ్మీర్‌లో పాక్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి

Operation Sindoor: రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్‌.. సిద్ధమైన క్షిపణులు..

Iran FM Seyed Araghchi: ఇండియా, పాక్ ఉద్రిక్తత వేళ ఇండియాకు ఇరాన్ మంత్రి

Pakistan: లాహోర్‌లో పేలుళ్లు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..

Read Latest International News And Telugu News

Updated Date - May 09 , 2025 | 04:45 AM