ITR Filing 2025: జోరుగా ఐటీ రిటర్న్ల ఫైలింగ్
ABN , Publish Date - Sep 14 , 2025 | 02:48 AM
ఐటీ రిటర్న్ల ఫైలింగ్ ప్రక్రియ జోరందుకుంది. 2025-26 అసె్సమెంట్ ఇయర్ (ఏవై)కు సంబంధించి ఇప్పటి వరకు ఆరు కోట్లకు పైగా ఐటీ రిటర్న్లు దాఖలైనట్టు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ శనివారం....
ఇప్పటి వరకు ఆరు కోట్లకు పైగా రిటర్న్లు
సోమవారమే ఆఖరి రోజు
ఐటీ రిటర్న్ల ఫైలింగ్ ప్రక్రియ జోరందుకుంది. 2025-26 అసె్సమెంట్ ఇయర్ (ఏవై)కు సంబంధించి ఇప్పటి వరకు ఆరు కోట్లకు పైగా ఐటీ రిటర్న్లు దాఖలైనట్టు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ శనివారం ప్రకటించింది. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్యూఎ్ఫ), ఆడిట్ అవసరం లేని సంస్థలు సోమవారం లోగా పెనాల్టీ లేకుండా తమ ఐటీ రిటర్న్లు ఫైల్ చేయవచ్చు. ‘ఇప్పటి వరకు ఆరు కోట్లకుపైగా ఐటీ రిటర్న్లు ఫైల్ అయ్యాయి. ఫైల్ అయినా రిటర్న్లను ఇంకా లెక్కిస్తున్నాం. ఈ మైలురాయిని అందుకునేందుకు సహకరించిన పన్ను చెల్లింపుదారులు, వృత్తి నిపుణులకు కృతజ్ఞతలు’ అని ఐటీ శాఖ సామాజిక మాఽధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. రిటర్న్ల ఫైలింగ్, పన్ను చెల్లింపులు, ఇతర విషయాల్లో పన్ను చెల్లింపుదారులకు అవసరమైన సాయం అందించేందుకు తమ ‘హెల్ప్ డెస్క్’ 24 గంటలూ పని చేస్తున్నట్టు ఐటీ శాఖ తెలిపింది. ఇంకా తమ రిటర్న్లు ఫైల్ చేయని వ్యక్తులు, సంస్థలు సోమవారం వరకు వేచి చూడకుండా వెంటనే తమ రిటర్న్లు ఫైల్ చేయాలని ఐటీ శాఖ కోరింది.
ఇవి కూడా చదవండి..
Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా
For More National News and Telugu News