డిపాజిట్ ఇన్సూరెన్స్ రూ.8-12 లక్షలకు పెంపు!?
ABN , Publish Date - Feb 20 , 2025 | 02:17 AM
బ్యాంక్ డిపాజిట్దారులకు మరింత రక్షణ లభించనుంది. బ్యాంక్ల్లో జమ చేసే సొమ్ము పై ప్రస్తుతం రూ.5 లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం...
న్యూఢిల్లీ: బ్యాంక్ డిపాజిట్దారులకు మరింత రక్షణ లభించనుంది. బ్యాంక్ల్లో జమ చేసే సొమ్ము పై ప్రస్తుతం రూ.5 లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం ఈ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు పెంచే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి ఈ నెలాఖరులోగా అధికారిక ప్రకటన వెలువడవచ్చని విశ్వసనీయవరాల సమాచారం. బ్యాంక్ల్లో, ముఖ్యంగా కో-ఆపరేటివ్ బ్యాంక్ల్లో అంతర్గత మోసాలు వెలుగు చూస్తుండటం.. తత్ఫలితంగా ఆ బ్యాంక్లు ఆర్థికంగా దివాలా తీస్తున్న కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి:
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్టెల్కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
Read More Business News and Latest Telugu News