ఏఎం గ్రీన్ కు కోల్ ఇండియా క్లీన్ పవర్
ABN , Publish Date - May 09 , 2025 | 04:34 AM
హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఏఎం గ్రీన్ అమ్మోనియా (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, ప్రభుత్వ రంగంలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) మధ్య కీలక ఒప్పందం కుదిరింది...
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఏఎం గ్రీన్ అమ్మోనియా (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, ప్రభుత్వ రంగంలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద సీఐఎల్, ఏఎం గ్రీన్ అమ్మోనియా ఏర్పాటు చేసే అమ్మోనియా ప్లాంట్లకు దశల వారీగా 4,500 మెగావాట్ల పవన, సౌర విద్యుత్ సరఫరా చేస్తుంది. ఇందులో 2,500 నుంచి 3,000 మెగావాట్ల సౌర విద్యుత్, 1,500 నుంచి 2,000 మెగావాట్ల పవన విద్యుత్ ఉంటుంది. సౌర విద్యుత్ ప్లాంట్లను గుజరాత్, రాజస్థాన్ల్లో, పవన విద్యుత్ ప్లాంట్లను దక్షిణాది రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్టు సీఐఎల్ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
Operation Sindoor: జమ్మూకాశ్మీర్లో పాక్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి
Operation Sindoor: రాజస్థాన్, పంజాబ్లో హై అలర్ట్.. సిద్ధమైన క్షిపణులు..
Iran FM Seyed Araghchi: ఇండియా, పాక్ ఉద్రిక్తత వేళ ఇండియాకు ఇరాన్ మంత్రి
Pakistan: లాహోర్లో పేలుళ్లు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..
Read Latest International News And Telugu News