బ్యాంకులు పారాహుషార్ సైబర్ సెక్యూరిటీ కట్టుదిట్టం
ABN , Publish Date - May 09 , 2025 | 04:40 AM
భారత-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యాంకులు కూడా అప్రమత్తమయ్యాయి. తమ వెబ్సైట్లు, సర్వర్ల మీద పాక్ సైబర్ కేటుగాళ్లు (హ్యాకర్లు) దాడి చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి...
న్యూఢిల్లీ: భారత-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యాంకులు కూడా అప్రమత్తమయ్యాయి. తమ వెబ్సైట్లు, సర్వర్ల మీద పాక్ సైబర్ కేటుగాళ్లు (హ్యాకర్లు) దాడి చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. వీటికి తోడు పాక్ సరిహద్దులకు సమీపంలో ఉన్న శాఖల్లో భద్రతను మరింత పటిష్ఠం చేశాయి. అలాగే ఆ ప్రాంతాల్లోని ఏటీఎంలను నగదుతో నింపేశాయి. ‘మా సైబర్ భద్రతా వ్యవస్థను బలోపేతం చేశాం. ఎలాంటి సైబర్ దాడి జరిగినా వెంటనే స్పందించేందుకు 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశాం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’ అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎండీ, సీఈఓ అశోక్ చంద్ర చెప్పారు.
ఎక్స్చేంజీలూ అప్రమత్తం: స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎ్సఈ, ఎన్ఎ్సఈ కూడా తమ సైబర్ భద్రతా చర్యలను ముమ్మరం చేశాయి. విదేశాల నుంచి ఎవరూ తమ వెబ్సైట్లను ఓపెన్ చేయకుండా చర్యలు చేపట్టాయి. బీఎ్సఈ అయితే మార్కెట్ పార్టిసిపెంట్స్ అందరూ తమ వ్యవస్థను ఎవరూ హ్యాక్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
Operation Sindoor: జమ్మూకాశ్మీర్లో పాక్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి
Operation Sindoor: రాజస్థాన్, పంజాబ్లో హై అలర్ట్.. సిద్ధమైన క్షిపణులు..
Iran FM Seyed Araghchi: ఇండియా, పాక్ ఉద్రిక్తత వేళ ఇండియాకు ఇరాన్ మంత్రి
Pakistan: లాహోర్లో పేలుళ్లు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..
Read Latest International News And Telugu News