సౌందర్య ఉత్పత్తుల మార్కెట్లోకి అనన్య బిర్లా
ABN , Publish Date - Feb 06 , 2025 | 03:16 AM
ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా సౌందర్య సాధనాల మార్కెట్లోకి ప్రవేశించారు. వేగంగా విస్తరిస్తున్న బ్యూటీ, కాస్మెటిక్స్ విభాగంలో కొత్త వెంచర్...
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా సౌందర్య సాధనాల మార్కెట్లోకి ప్రవేశించారు. వేగంగా విస్తరిస్తున్న బ్యూటీ, కాస్మెటిక్స్ విభాగంలో కొత్త వెంచర్ ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. అయితే ఆ వెంచర్ పేరు గాని, పెట్టుబడి వివరాలు గాని వెల్లడించలేదు. ఈ ఏడాది కొత్త బ్యూటీ, పర్సనల్ కేర్ బ్రాండ్లను మార్కెట్కు పరిచయం చేయనున్నామని ఆమె తెలిపారు. పర్సనల్ కేర్ ఉత్పత్తుల మార్కెట్ ఏటా 10-11 శాతం వృద్ధితో 2028 నాటికి 3,400 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనాగా చెబుతున్నారు. మారుతున్న యువత అభిరుచులకు దీటుగా కొత్త తరం బ్రాండ్లను తమ సంస్థ మార్కెట్లో ఆవిష్కరిస్తుందని అనన్య తెలిపారు. అనన్య 17 సంవత్సరాల వయసులోనే మైక్రో లెండింగ్లోకి ప్రవేశించారు. ఆమె నిర్వహణలోని స్వతంత్ర మైక్రో ఫిన్ దేశంలోనే రెండో పెద్ద ఎన్బీఎ్ఫసీ-ఎంఎ్ఫఐగా ఎదిగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణ మిల్క్ యూనియన్... ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే..
రెచ్చిపోతున్న పావురాళ్ల పందాల నిర్వాహకులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News