EIPL Fire Visakhapatnam: EIPL లో భారీ అగ్ని ప్రమాదం..
ABN , Publish Date - Sep 07 , 2025 | 03:29 PM
విశాఖపట్నం హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున పొగ, మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ప్రమాదం సూచికగా ఫ్యాక్టరీలో సైరన్లు మ్రోగాయి. దీంతో ఉద్యోగులను హుటాహుటీన బయటకి పంపించివేశారు.
విశాఖ: HPCLలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. HPCL పరిధిలో ఉన్న EIPL ఎనర్జీ కంపెనీ పెట్రోలియం ట్యాంక్ ఫామ్లో ఒక్కసారిగా పిడుగు పడటంతో.. భారీగా మంటలు చెలరేగాయి. దీంతో అలర్ట్ అయిన కంపెనీ యాజమాన్యం ఉద్యోగులను వెంటనే బయటకు పంపించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిసి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఈ అగ్ని ప్రమాదంపై హోం మంత్రి అనిత స్పందించారు. అగ్నిమాపక శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి.. వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు మంటలు అదుపులోకి వచ్చాయని ఆమె తెలిపారు. సంఘటనా స్థలంలో ఉన్నతాధికారులు పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మహేశ్గౌడ్కు సీఎం రేవంత్ సన్మానం