Montha Cyclone Update: ఆంధ్ర తీరం దిశగా దూసుకువస్తోన్న 'మొంథా' తుఫాను
ABN , Publish Date - Oct 27 , 2025 | 06:33 AM
ఆంధ్ర తీరం దిశగా 'మొంథా' తుఫాను దూసుకువస్తోంది. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం, తుఫానుగా మారింది. ఇది మరింతగా బలపడి తీవ్ర తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉంది.
విశాఖపట్నo, అక్టోబర్ 27: ఆంధ్ర తీరం దిశగా 'మొంథా' తుఫాను దూసుకువస్తోంది. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం, తుఫానుగా మారింది. ఇది మరింతగా బలపడి తీవ్ర తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది.. పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ.. దిశ మార్చుకొని ఉత్తర వాయువ్య దిశగా కదలడం మొదలైంది.
ఈ వాయుగుండం గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇప్పటికిది తూర్పు ఆగ్నేయంగా , చెన్నైకి 680, దక్షిణాగ్నేయంగా కాకినాడకు 600 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 710 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఇవీ చదవండి:
నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..
హైదరాబాద్ యాపిల్ ఎయిర్పాడ్స్ తయారీ హబ్
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి