Share News

Breaking News: చర్చ్‌లోకి వెళ్లి తాళాలు వేసుకున్న పాస్టర్.. అసలేమైందంటే..

ABN , First Publish Date - Jan 23 , 2025 | 10:16 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: చర్చ్‌లోకి వెళ్లి తాళాలు వేసుకున్న పాస్టర్.. అసలేమైందంటే..
Breaking News

Live News & Update

  • 2025-01-23T19:07:52+05:30

    చర్చ్‌లోకి వెళ్లి తాళాలు వేసుకున్న పాస్టర్.. అసలేమైందంటే..

    • హైదరాబాద్ : ముషీరాబాద్ హెబ్రోన్ చర్చ్ వద్ద ఉద్రిక్తత.

    • చర్చ్‌పై తమకు హక్కు ఉందంటూ రెండు వర్గాల గొడవ.

    • ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.

    • చర్చ్‌లోకి వెళ్లి తాళాలు వేసుకున్న పాస్టర్ వీరాచారి వర్గం.

    • తాళాలు పగలగొట్టే యోచనలో పోలీసులు.

    • సుమారు 100 మంది పోలీసులు మోహరింపు.

  • 2025-01-23T17:57:59+05:30

    ఐటీ సోదాలు.. కోపంతో దిల్‌రాజు ఏం చేశారంటే..

    • సినీ నిర్మాత దిల్ రాజు నివాసంలో మూడో రోజు కొనసాగుతున్న సోదాలు.

    • దిల్ రాజు నివాసంలోని డాక్యుమెంట్లను తనిఖీ చేస్తున్న ఐటి అధికారులు.

    • ఐటి అధికారిణితో దిల్ రాజు ఆర్గ్యుమెంట్.

    • ఐటి అధికారిణి మాట్లాడుతుండ సీరియస్‌గా వెళ్ళిపోయిన దిల్ రాజు.

  • 2025-01-23T17:41:24+05:30

    దావోస్ నుంచి ఢిల్లీకి చేరుకోనున్న సీఎం చంద్రబాబు..

    • గురువారం నాడు దావోస్ నుంచి ఢిల్లీకి చేరుకోనున్న సీఎం చంద్రబాబు.

    • గురువారం అర్థరాత్రి 12.30 గంటలకు దావోస్‌ నుంచి ఢిల్లీ చేరుకోనున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

    • శుక్రవారం నాడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులను కలుసుకోనున్నారు.

    • కేంద్ర ఆర్ధిక, వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖల మంత్రులను కలవనున్నారు.

    • ఫిబ్రవరి 1న పార్లమెంటు ముందుకు కేంద్ర బడ్జెట్‌ రానున్న నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.

    • ఉదయం 11గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు.

    • ఆ తర్వాత మధ్యాహ్నం 12గంటలకు మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌తో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.

    • వ్యవసాయ, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో భేటీ తర‌వాత విజయవాడ బయలుదేరనున్నారు.

    • సమయం ఇస్తే.. పునరుత్పాధక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషిని కూడా కలిసే అవకాశం ఉంది.

  • 2025-01-23T13:38:44+05:30

    హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ

    • తెలంగాణలో కొత్తగా 17వేల ఐటీ ఉద్యోగాలు

    • హైదరాబాద్‌లో తమ ఐటీ క్యాంపస్‌ను విస్తరించనున్న ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్

    • పోచారంలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో అదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలుల సిద్ధం చేసిన ఇన్పోసిస్

    • దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఇన్ఫోసిస్ సీఎఫ్‌వోతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు సమావేశం

  • 2025-01-23T13:33:42+05:30

    తెలంగాణకు భారీ పెట్టుబడులు..

    • తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

    • దావోస్ వేదికపై తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

    • రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన అమెజాన్

    • దావోస్ లో తెలంగాణ సర్కార్ తో అమెజాన్ ఏంవోయూ

    • డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం

    • దావోస్‌ వేదికగా పెట్టుబడుల సమీకరణలో ఇప్పటికే కొత్త రికార్డు నెలకొల్పిన తెలంగాణ

    • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని దావోస్‌లో అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం

    • హైదరాబాద్‌లో రూ.60వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరం

    • ఒక బిలియన్ పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు సెంటర్లను గతంలోనే అభివృద్ధి చేసిన అమెజాన్

    • కొత్తగా చేపట్టే విస్తరణ ప్రణాళికలకు అవసరమైన భూమిని కేటాయించాలని రాష్ట్రప్రభుత్వానికి అమెజాన్ విజ్ఞప్తి

  • 2025-01-23T13:11:31+05:30

    రుణమాఫీపై మంత్రి కీలక వ్యాఖ్యలు

    • తెలంగాణలో రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు

    • పదేళ్ల విధ్వంస పాలనకు గురైన రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ చేశాము

    • గత ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టి కొంతమంది రైతులకు రైతు బంధు వేశారు

    • పదేళ్ళుగా రేషన్ కార్డులు ఇవ్వలేని గత ప్రభుత్వం గ్రామ సభలకు అడ్డుతగులుతుంది.

    • నల్గొండలో రైతులు ఎందుకు దీక్ష చేస్తారు

    • దొడ్డు బియ్యం మాఫియా ఉండటంతో ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నాం

    • పదేళ్ళు రుణమాఫీ ఎందుకు చేయలేదని నల్గొండ బిఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలో నిలదీయండి

    • జనవరి 26 నుంచి రైతులకు రైతు భరోసా ఇస్తాం

    • సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి లక్ష కోట్ల పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు

  • 2025-01-23T12:38:20+05:30

    గ్రామసభలో గందరగోళం

    • ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మహమ్మద్ గౌస్ పల్లి గ్రామ సభలో గందరగోళం

    • అనర్హుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఉన్నాయంటూ కొందరు గ్రామస్తుల ఆగ్రహం

    • అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించాలని డిమాండ్

  • 2025-01-23T10:16:17+05:30

    రోడ్డు ప్రమాదం..

    • పుంగనూరులో రోడ్డు ప్రమాదం. ఇద్దరు మృతి..

    • పుంగనూరు మండలం ఎటవాకిలి క్రాస్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ

    • మృతులు గంగాధర (45), వెంకటరమణ(54)