-
-
Home » Andhra Pradesh » Today Breaking News In Telugu Live Updates Wednesday 19 th February 2025 Suri
-
Breaking News: ఆర్టీసీ బస్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం..
ABN , First Publish Date - Feb 19 , 2025 | 08:48 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-02-19T11:39:16+05:30
ఆర్టీసీ బస్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం..
కుషాయిగూడ ఆర్టీసీ బస్ డిపోలో భారీగా చెలరేగిన మంటలు.
డిపోలో పార్కింగ్ చేసిన 2 బస్సుల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించి క్షణాల్లో బస్లు దగ్ధం అయ్యాయి.
దీంతో డిపోలో పనిచేస్తున్న మెకానిక్లు, ఉద్యోగులు భయాందోళనతో పరుగులు.
ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
-
2025-02-19T10:53:03+05:30
ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్ కుమార్
ఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్ కుమార్
జ్ఞనేశ్ కుమార్కి అభినందనలు తెలిపిన ఎన్నికల కమిషనర్ సుఖ్బిర్ సింగ్ సంధు
దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటింగ్ అని బాధ్యతల స్వీకరణ సందర్భంగా చెప్పిన జ్ఞానేశ్ కుమార్
18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఎలక్టర్గా మారాలని కోరిన నూతన సీఈసీ
ఎన్నికల వేళ ప్రతి ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న నూతన సీఈసీ
భారత రాజ్యాంగం, ఎన్నికల చట్టాల ద్వారా భారత ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ ఓటర్లతో ఉంటుందన్న జ్ఞానేశ్ కుమార్
-
2025-02-19T10:31:19+05:30
పునఃప్రారంభం కానున్న మదనపల్లె సబ్ కలెక్టరేట్
అన్నమయ్య జిల్లా: నేడు పునఃప్రారంభం కానున్న మదనపల్లె సబ్ కలెక్టరేట్
కార్యక్రమానికి హాజరుకానున్న రెవెన్యూ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా
గతేడాది జులై 21న సబ్ కలెక్టరేట్లో దుమారం రేపిన ఫైళ్ల దహనం ఘటన
ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి ఫైళ్లు దహనం అయ్యినట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు
కీలక ఫైళ్ల దహనంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల కుట్ర ఉన్నట్లు అధికారుల అనుమానం
ఫైళ్ల దగ్ధంపై మెుత్తం 9 మందిపై కేసులు నమోదు చేసిన సీఐడీ పోలీసులు
అప్పటి ఆర్డీవోలు మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజపై కేసు నమోదు, సస్పెన్షన్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకటాచలపతిపై కేసు నమోదు
అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏ తుకారాం, ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి, శశికాంత్ పైనా కేసులు నమోదు
ఈ కేసులో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు
ఏసీబీ కేసులో ఆర్డీవో మురళిని అరెస్టు, ఏడు నెలల తర్వాత మళ్లీ నేడు ప్రారంభం కానున్న సబ్ కలెక్టరేట్
-
2025-02-19T09:42:06+05:30
బర్డ్ ఫ్లూ కలకలం..
వనపర్తి: మధనాపురం మండలం కొన్నూరులో బర్డ్ ఫ్లూ కలకలం
శివకేశవరెడ్డికి చెందిన కోళ్ల ఫామ్లో బర్డ్ ఫ్లూ సోకి మత్యువాత పడిన 3,000 కోళ్లు
అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని బాధితుడు ఆగ్రహం
గ్రామ శివారులోనే గోతి తీసి 3 వేల కోళ్లను పూడ్చిన కోళ్ల ఫామ్ యజమాని
-
2025-02-19T09:35:19+05:30
సీసీసీ సెంటర్లో గుర్తుతెలియని వ్యక్తి హల్చల్
హైదరాబాద్: బంజారాహిల్స్లోని సీసీసీ సెంటర్లో గుర్తుతెలియని వ్యక్తి హల్చల్
సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్న సమయంలోనే మూడుసార్లు వచ్చివెళ్లిన నిందితుడు
గుర్తుతెలియని వ్యక్తిని జ్ఞానసాయి ప్రసాద్గా గుర్తించి కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు
టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ ప్రచారం చేసుకున్న నిందితుడు జ్ఞానసాయి ప్రసాద్
సీసీసీ సెంటర్ ఎదురుగా ఉన్న హోటల్లోకి వెళ్లి వ్యాపార లావాదేవీల పేరుతో గోవర్ధన్ అనే వ్యక్తి నుంచి డబ్బులు వసూలు
గోవర్ధన్ నుంచి రూ.3 లక్షలు వసూలు చేసిన నిందితుడు జ్ఞానసాయి ప్రసాద్
సీఎం ఉన్న సమయంలోనే సీసీసీ సెంటర్లోకి నిందితుడు వచ్చి వెళ్లడంపై పోలీసులు సీరియస్
హోటల్తోపాటు సీసీసీలో సీసీ ఫుటేజ్లను సేకరించి విచారణ చేస్తున్న పోలీసులు
-
2025-02-19T09:18:55+05:30
ఢిల్లీ సీఎంపై నేటితో వీడనున్న ఉత్కంఠ
ఢిల్లీ: ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం
బీజేఎల్పీ సమావేశంలో ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిపై స్పష్టత వచ్చే అవకాశం
బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బీజేఎల్పీ నేతను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు
సమావేశంలో పాల్గొననున్న కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలు, ఢిల్లీ బీజేపీ ఎంపీలు
బీజేఎల్పీ నేత ఎన్నిక తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ను కలవనున్న నేతలు
ఇప్పటికే సీఎం ప్రమాణస్వీకారం కోర్డినేటర్లుగా వినోద్ తావ్డే, తరుణ్ చుగ్ను నియమించిన బీజేపీ అధిష్ఠానం
సీఎం అభ్యర్థిపై స్పష్టత వచ్చిన తర్వాత గురువారం నాడు ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం
ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్, ఆశిశ్ సూద్, పవన్ శర్మ, అజయ్ మహావార్
రామ్ లీలా మైదానంలో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేసిన ఢిల్లీ ప్రభుత్వ అధికారులు
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న ఎన్డీయే కీలక నేతలు
-
2025-02-19T08:58:55+05:30
మరోసారి ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి పర్యటన షెడ్యూల్
బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఉదయం 11:30 గంటలకు యూఎస్ ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం
యూఎస్ ప్రతినిధులతో జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్పై అవగాహన ఒప్పందం
అనంతరం మధ్యాహ్నం 12:30 వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్పై అధికారులతో సమీక్షించనున్న చంద్రబాబు
సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్న సీఎం చంద్రబాబు
-
2025-02-19T08:48:32+05:30
సుప్రీంకోర్టులో నేడు కీలక కేసు విచారణ..
ఢిల్లీ: సుప్రీంకోర్టులో నేడు ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ కేసు విచారణ
2023లో సెలక్షన్ ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పిస్తూ చట్టం చేసిన కేంద్రం
కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు
కేసు విచారణ జరపనున్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం