Kurnool Bus Accident: బస్సు ప్రమాదం జరిగిందిలా.. మొత్తం ప్రయాణికులు వీరే..
ABN , Publish Date - Oct 24 , 2025 | 09:54 AM
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వీ కావారే ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు కర్నూలుకు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. బైకును ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కర్నూలుకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ బస్సు బైకును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు సజీవదహనమైనట్లు తెలుస్తోంది.. ప్రమాదనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
వీ కావేరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు పటాన్ చెరువులోని ప్రధాన ఆఫీసు నుంచి గురువారం రాత్రి 9గంటలకు బయలుదేరింది. బీరంగూడ, గండి మైసమ్మ, బాచుపల్లి ఎక్స్ రోడ్, సూరారం, మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్, వనస్థలిపురం పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకుని బెంగళూరు బయలుదేరింది. శుక్రవారం వేకువ జాము 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలోకి రాగానే.. ఎదురుగా వెళ్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకు పూర్తిగా బస్సు కిందకు దూరిపోయింది. ఈ క్రమంలో బైకు పెట్రోల్ లీక్ అయి అవడంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మొత్తం 20 మంది వెంటనే అప్రమత్తమవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు ఫిట్నెస్ లేకపోవడంతో పాటూ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బస్సు ఫిట్నెస్ వ్యాలిడిటీ 2025 మార్చి 31 వరకు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. ప్రమాదంలో ఇప్పటి వరకూ మొత్తం 11 మంది మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. బస్సు ఢీకొనడంతో బైకు డ్రైవర్ కూడా అక్కడికక్కడే చనిపోయినట్లు తెలిసింది.
నిజాంపేట్ క్రాస్ రోడ్లో బస్సు ఎక్కిన శ్రీహర్ష సాఫ్ట్వేర్ ఇంజినీర్. నెల్లూరు జిల్లాకు చెందిన అతను ఇటీవల ఆఫీస్ పని మీద హైదరాబాద్ వచ్చి తిరిగి బెంగళూరు వెళ్తున్నాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో బస్సులో మంటలు అంటుకోగానే.. కిటికీ అద్దాలు పగలగొట్టి బయటపడి ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రస్తుతం అతను కర్నూలు (Kurnool ) ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెస్ రామారెడ్డి.. తన బావ దగ్గరికి వచ్చి తిరిగి బెంగుళూరులోని తన భార్య, కూతురు వద్దకు వెళ్తున్నాడు. జెఎన్టీయూలో బస్సు ఎక్కిన అతను.. ప్రమాదంలో అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇతను బస్సు చివరలో ఉండడంతో ప్రమాదం జరగ్గానే బయటి నుంచి కొందరు డోర్ గట్టిగా కొట్టారు. దీంతో ఉలిక్కిపడి పైకి లేచిన అతన్ని.. బయటికి నుంచి కొందరు కిందకు లాగేశారు. ఇతడితో పాటూ వేణుగోపాల్ రెడ్డి, సుబ్రమణ్యం అనే ఇద్దరు కూడా బయటపడ్డాడు. వీరిలో సుబ్రహ్మణ్యం కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బస్సు ప్రమాదంలో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిలో ఒకరు సీట్ నెంబర్ U4లో ఉన్న సురారానికి చెందిన గుణ సాయి కాగా, మరొకరు సీట్ నెంబర్ U18లో ఉన్న బహుదూర్ పల్లికి చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. వీరిద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా విద్యానగర్ ప్రాంతానికి చెందిన జయంత్ అనే వ్యక్తి బస్సులో నుండి దూకేశాడు. ఈ ఘటనలో అతడి ఎడమ కాలికి స్వల్ప గాయమైనట్లు తెలిసింది. మిగతా ప్రయాణికుల వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానికులు స్పందించడంతో..
బస్సు ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది స్థానికులు వెంటనే స్పందించారు. చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాదం జరగ్గానే అటుగా వెళ్తున్న ఓ మహిళ వెంటనే వీడియో తీసి, పోలీసులకు సమాచారం అందించింది. వీడియోను పోలీసులకు షేర్ చేయడంతో వారు ప్రమాద తీవ్రతను గుర్తించి, అన్ని విభాగాలనూ అలెర్ట్ చేయగలిగారు. అలాగే అదే మార్గంలో వెళ్తున్న ఓ వ్యక్తి క్షతగాత్రులను తన కారులో ఎక్కించుకుని కర్నూలులోని ఆస్పత్రికి చేర్చారు. ఇలా చాలా మంది వెంటనే స్పందించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో సాయం చేశారు.
ప్రమాదం నుంచి బయటపడ్డ తెలంగాణ వారు వీరే..
కర్నూలు బస్సు ప్రమాదం నుంచి బయటపడిన వారిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. సత్యనారాయణ (ఖమ్మం), జయసూర్య (మియాపూర్), నవీన్ (హైదరాబాద్), అశోక్ (మాడుగుల), కీర్తి (ఎస్ఆర్ నగర్), గుణసాయి (హైదరాబాద్), గ్లోరా ఎల్సా (హైదరాబాద్) ఉన్నట్లు అధికారులు తెలిపారు.
బస్సులో ఉన్న ప్రయాణికుల వివరాలు ఈ క్రింద ఉన్న చిత్రాల్లో చూడొచ్చు..





ప్రమాదనికి గురైన బస్సు ఇదే..
