Temperature Rise : పెరిగిన ఎండ
ABN , Publish Date - Feb 09 , 2025 | 04:47 AM
పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు
దేశంలోనే అత్యధికంగా నందిగామలో 37.6 డిగ్రీలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొంది. శనివారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నందిగామలో వరుసగా ఐదో రోజు దేశంలోనే అత్యధికంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజులు పొడి వాతావరణం కొనసాగుతుందని, పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..
Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..