Share News

YSRCP: వైసీపీ ఆవిర్భావ దినోత్సవంలో వైఎస్‎ను మరచిన ఈ నేతలు..

ABN , Publish Date - Mar 12 , 2025 | 02:01 PM

ఓ చోట వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కానీ అక్కడ మాత్రం దివంగత వైఎస్ఆర్ కు గౌరవం దక్కలేదు. అక్కడికి వచ్చిన కీలక నేతలు ఆయన పట్ల నిర్లక్ష్యం వహించారు. దీనిపై ప్రస్తుతం పలువురు పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

YSRCP: వైసీపీ ఆవిర్భావ దినోత్సవంలో వైఎస్‎ను మరచిన ఈ నేతలు..
some leaders Forget YSR at Machilipatnam

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే, ఈ వేడుకల్లో పార్టీ స్థాపకుడైన వైఎస్ఆర్ (వైయస్ రాజశేఖర రెడ్డి)కి మాత్రం గౌరవం అందించడంలో పలువురు వైసీపీ నేతలు అసంపూర్తిగా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి కార్యక్రమంలోనూ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించే వైసీపీ నేతలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున మాత్రం వైఎస్ఆర్‌ గుర్తుకు రాకపోవడం పార్టీ కార్యకర్తలకు ఆశ్చర్యం కలిగించింది. ఈ క్రమంలో వైఎస్ఆర్‌ను పూర్తిగా మర్చిపోయినట్లు కనిపించిన వైసీపీ నేతలపై పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ అవిర్భావ దినోత్సవం రోజున కనీస నివాళి కూడా ఆర్పించని వైసీపీ నేతలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.


వైఎస్ఆర్ పట్ల నిర్లక్ష్యం

మచిలీపట్నంలో కార్యకర్తలతో కలిసి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని, మచిలీపట్నం వైసీపీ ఇన్చార్జి పేర్ని కిట్టు, పార్టీ జెండాను ఆవిష్కరించారు. కానీ వేడుకల్లో వైఎస్ఆర్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం, పార్టీ కార్యకర్తలకు తీవ్రంగా నిరాశ కలిగింది. దీంతో పార్టీ స్థాపకుడు, ప్రజల అభిమానం పొందిన నాయకుడైన వైఎస్ఆర్ పట్ల ఆయా నేతలు అనుసరించిన నిర్లక్ష్యం సరికాదని అంటున్నారు. అంతేకాదు ఈ నేతలు, వైఎస్ఆర్ నాయకత్వంలో ప్రజలకు అందించిన సేవలను కూడా గుర్తు చేసుకోవడం మర్చిపోయారని చెబుతున్నారు. వారిద్దరూ కూడా కార్యక్రమంలో వైఎస్ఆర్ పట్ల సరైన గౌరవాన్ని ప్రదర్శించకపోవడం ఇప్పుడు మరో చర్చకు దారి తీసింది.


పార్టీ నుంచి తొలగిస్తారా

ఇలాంటి నేతలు వైఎస్ఆర్‌ను మరచిపోతే, పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని పలువురు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ అనేక మంది ప్రజల్లో తన ఆత్మీయతతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆయన కేవలం ఒక పార్టీ నాయకుడిగా మాత్రమే కాకుండా, ప్రజల పాలకుడిగా కూడా చరిత్రలో నిలిచిపోయారు. తన ప్రభుత్వ సమయంలో ప్రజల సంక్షేమం కోసం చేసిన అనేక పథకాలతో ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. అయితే, తాజాగా జరిగిన ఈ రాజకీయ పరిణామం పార్టీకి హాని కలిగిస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు వైఎస్ఆర్ ను పట్టించుకోని ఈ నేతలు పార్టీ నుంచి మారే అవకాశం ఉందా అని కూడా చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై వైసీపీ నాయకత్వం ఎలా స్పందిస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి మరి.


ఇవి కూడా చదవండి:

Iphone 17 Air: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్..ఐఫోన్ 17 ఎయిర్ లాంచ్ డేట్, ఫీచర్స్ లీక్..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 12 , 2025 | 02:04 PM