Bhuma Karunakara Reddy: భూమన హయాంలో టీటీడీని దోచారు
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:50 AM
మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం దోపిడీకి గురైందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. కరుణాకరరెడ్డికి హిందూ మతం గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన విమర్శించారు.

శ్రీవారి విషయంలో అపచారం
అందుకే వైసీపీ మట్టికొట్టుకు పోయింది: మంత్రి ఆనం
నెల్లూరు, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): ‘భూమన కరుణాకరరెడ్డి రెండుసార్లు టీటీడీ చైర్మన్గా చేశారు. ఆయన హయాంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం దోపిడీకి గురైంది’ అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. గరువారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నాస్తికుడు. ఆయనకు వేంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదు. అలాంటి వ్యక్తిని రెండు సార్లు టీటీడీ చైర్మన్ను చేశారు. శ్రీవారి విషయంలో చేసిన అపచారాల వల్లే రాష్ట్రంలో వైసీపీ మట్టి కొట్టుకుపోయింది. భూమన నిజంగా శ్రీవారి భక్తుడే అయితే ముందు తిరుమల మొదటి మెట్టు వద్ద తలాన్చి ‘స్వామీ..! మా నాయకులు చెబితే తప్పు చేశాను. నన్ను క్షమించు’ అని ప్రాధేయపడాలి. టీటీడీ గోశాలలో ఆవుల మరణాలు సహజమైనవని అందరూ ఘోషిస్తుంటే వైసీపీ నేతలు మాత్రం టీటీడీ పవిత్రతను దెబ్బ తీసే విధంగా కుట్రలు పన్నుతున్నారు. హిందూమతేతర సంప్రదాయాలను అనుసరించే కరుణాకరరెడ్డికి గోవు గురించి, హిందూ మతం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గోవు, తల్లి గురించి మాట్లాడే మీ నాయకుడిని ఆయన తల్లే ‘నా కడుపున ఎలా ఉట్టావు..!?’ అని అడుగుతోందంటే మీరు, మీ విశ్వసనీయత ఏ పాటిదో అందరికి అర్థమవుతోంది’ అని మంత్రి ఆనం ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల
AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..
AP High Court: బోరుగడ్డ అనిల్కు గట్టి షాక్
Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..
Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత
Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
For AndhraPradesh News And Telugu News