Share News

National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల

ABN , Publish Date - Apr 17 , 2025 | 07:59 PM

National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్- 2 ఫైనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. అయితే వీటిలో పలు తప్పులు ఉన్నట్లు విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈ ఫైనల్ కీ కి ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులకు ఎన్‌టీఏ సూచించింది.

National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: జేఈఈ మెయిన్ సెషన్- 2 ఫైనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం విడుదల చేసింది. ఈ మేరకు ఫైనల్ కీని http://jeemain.nta.nic.in/లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది. అయితే రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన విషయం విధితమే.

ఇక జనవరి, ఇటీవల జరిగిన ఈ పరీక్షల్లోని స్కోర్ ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. ఈ పరీక్ష సమాధానాల్లో పలు తప్పిదాలు ఉన్నాయంటూ విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై ఎన్‌టీఏ స్పందించింది. తుది కీ వచ్చే వరకు వేచి చూడాలని విద్యార్థులకు సూచించిన సంగతి తెలిసిందే. ఈ కీ మాత్రమే స్కోరును నిర్ణయిస్తుందని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

Updated Date - Apr 17 , 2025 | 07:59 PM