Heavy Rain: 48 గంటల్లో అల్పపీడనం
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:24 AM
రాష్ట్రంలో అనేక చోట్ల ఆదివారం ఎండ తీవ్రత కొనసాగింది. కావలిలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ..
ఉత్తర కోస్తాకు మూడు రోజులు భారీ వర్షాలు
విశాఖపట్నం, అమరావతి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అనేక చోట్ల ఆదివారం ఎండ తీవ్రత కొనసాగింది. కావలిలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మూడు, నాలుగు రోజుల నుంచి ఎండ తీవ్రత కొనసాగడంతో క్యుములో నింబస్ మేఘాలు ఆవిరించి రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. అదే ప్రభావంతో సోమవారం నుంచి ఉత్తరకోస్తాలో వర్షాలు పెరగనున్నాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. వచ్చే 48 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్కు ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 26, 27, 28 తేదీల్లో ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News