AP PM Modi: మరికాసేపట్లో శ్రీశైలానికి ప్రధాని మోదీ.. 50 నిమిషాలు స్వామి సేవలో
ABN , Publish Date - Oct 16 , 2025 | 10:35 AM
కర్నూలు ఏయిర్ పోర్టు నుంచి రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభకు గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్, కేంద్ర రాష్ట్ర మంత్రులు బయలుదేరారు. ఈ నేపథ్యంలో రూ.13,430 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
కర్నూల్: ప్రధాని నరేంద్ర మోదీ ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో ప్రధాని శ్రీశైలం చేరుకోనున్నారు.
శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని మోదీ దర్శించుకుంటారు. సుమారు 50 నిమిషాల పాటు భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో గడపనున్నారు. తర్వాత శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. సుమారు 40 నిమిషాల పాటు శివాజీ స్పూర్తి కేంద్రం ద్యాన మందిరంలో మోదీ గడుపుతారు. అనంతరం 1.30 గంటలకు శ్రీశైలం నుంచి బయలుదేరి కర్నూలు బహిరంగ సభకి బయలుదేరి వెళ్తారు.
మరోవైపు కర్నూలు ఏయిర్ పోర్టు నుంచి రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభకు గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు బయలుదేరారు. ఈ నేపథ్యంలో రూ.13,430 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. సభ అనంతరం సాయంత్రం 4:45కు ప్రధాని మోదీ ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.
ఇవి కూడా చదవండి..
Transgenders Hospitalized in Delhi: ఫినాయిల్ తాగిన 25 మంది ట్రాన్స్జెండర్లు
The Central Government Informed: రక్షణ భూముల స్వాధీనానికి మార్గదర్శకాలు ఇవ్వండి