Kanakadurga Temple Committee: గుడ్ న్యూస్.. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయ కమిటీ నియామకం
ABN , Publish Date - Sep 26 , 2025 | 09:59 PM
కూటమి ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయ కమిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయ కమిటీ (Vijayawada Indrakiladri Kanakadurga Temple Committee)ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Govt) నియమించింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఇవాళ(శుక్రవారం) ఉత్తర్వులు జారీచేసింది. దుర్గ గుడి ఆలయ బోర్డు సభ్యులుగా 16 మందిని నియమిస్తూ కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్గా బొర్రా రాధాకృష్ణని నియమించింది ఏపీ ప్రభుత్వం.
దుర్గగుడి ఆలయ కమిటీ సభ్యులుగా వీరే.....
1. అవ్వారు శ్రీనివాసరావు - విజయవాడ వెస్ట్ - బీజేపీ
2. బడేటి ధర్మారావు - విజయవాడ సెంట్రల్ - తెలుగుదేశం
3. గూడపాటి సరోజినీ దేవి - మైలవరం - తెలుగుదేశం
4. జీవీ నాగేశ్వర్రావు – రేపల్లె – తెలుగుదేశం
5. హరికృష్ణ – హైదరాబాద్ - తెలుగుదేశం తెలంగాణ
6. జింకా లక్ష్మీ దేవి – తాడిపత్రి – తెలుగుదేశం
7. మన్నె కళావతి - నందిగామ - తెలుగుదేశం
8. మోరు శ్రావణి - దెందులూరు – తెలుగుదేశం
9. పద్మావతి ఠాకూర్ - విజయవాడ వెస్ట్ – జనసేన
10. పనబాక భూ లక్ష్మి - నెల్లూరు రూరల్ – తెలుగుదేశం
11. పెనుమత్స రాఘవ రాజు – విజయవాడ సెంట్రల్ – బీజేపీ
12. వెలగపూడి శంకర్ బాబు – పెనమలూరు – తెలుగుదేశం
13. సుకాశి సరిత – విజయవాడ వెస్ట్ – తెలుగుదేశం
14. తంబాళపల్లి రమాదేవి – నందిగామ – జనసేన
15. తోటకూర వెంటక రమణా రావు – తెనాలి – జనసేన
16. అన్నవరపు శివ పార్వతి – పెనమలూరు – తెలుగుదేశం
ఈ వార్తలు కూడా చదవండి..
లాజిస్టిక్స్ వ్యయం తగ్గించడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఏపీ శాసనసభలో నాలా యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
Read latest AP News And Telugu News