Share News

AP News: ఏపీ విద్యావ్యవస్థపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jan 12 , 2025 | 04:26 PM

తాడింకి పాఠశాల శతాబ్ది వేడుకలు పండగ వాతావరణంలో నిర్వహించడం, అందులో తానూ భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పెద్దలు యలమంచిలి శివాజీ.. బ్రిటిష్ కాలంలోనే పది ఎకరాల భూమిని ఇవ్వడంతో పాఠశాల ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు.

AP News: ఏపీ విద్యావ్యవస్థపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు..
Minister Kollu Ravindra and MP Balashowry

కృష్ణా జిల్లా: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో పేద విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ పాటు పడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేందుకు మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారని కొల్లు చెప్పారు. పమిడిముక్కల మండలం తాడింకి జిల్లా పరిషత్ పాఠశాల శతాబ్ది వేడుకల్లో ఎంపీ వల్లభనేని బాలశౌరి (MP Vallabbhaneni Balashowry), ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, బోడె ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థులు, స్థానికులు పెద్దఎత్తున హాజరయ్యారు.


తాడింకి పాఠశాల శతాబ్ది వేడుకలు పండగ వాతావరణంలో నిర్వహించడం, అందులో తానూ భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పెద్దలు యలమంచిలి శివాజీ.. బ్రిటిష్ కాలంలోనే పది ఎకరాల భూమిని ఇవ్వడంతో పాఠశాల ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. యలమంచిలి శివాజీ త్యాగం వల్లే లక్షలాది మందికి ఈ పాఠశాల ద్వారా విద్యాబుద్దులు నేర్పించగలిగినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. వందేళ్ల పాఠశాల పండగకు పూర్వ విద్యార్థులందరూ రావడం శుభపరిణామం అని, వారందరినీ అభినందిస్తున్నట్లు రవీంద్ర చెప్పుకొచ్చారు. గత ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ స్కూళ్ల భూములు దోచేయడానికే జగన్ ప్రభుత్వం పాఠశాలల విలీన ప్రక్రియ తీసుకొచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తు్న్నట్లు మంత్రి రవీంద్ర చెప్పుకొచ్చారు.


ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొల్లు చెప్పారు. ఇందు కోసం విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మంత్రి లోకేశ్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు కొల్లు తెలిపారు. దీంతో వారిలో నైపుణ్యాలు పెరిగి ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా తయారవుతారని చెప్పారు. ఇందుకు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. మరోవైపు ఎంసెట్‌కు సైతం ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావడమే రాష్ట్రంలో మంచి ప్రభుత్వం నడుస్తుందనడానికి ఉదాహరణ అని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.


ఈ సందర్భంగా ఎంపీ బాలసౌరి మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా పంగడ నిర్వహించుకోవాలని చెప్పారు. అందరి జీవితాల్లో ఈ సంక్రాంతి వెలుగు నింపాలని దేవుణ్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాడింకి పాఠశాల వందేళ్లు పూర్తి చేసుకోవడంతో జరుగుతున్న వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం లేదా సీఎస్సార్ నిధులతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ బాలశౌరి హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: ఐదేళ్లలో మేము ఇచ్చే ఉద్యోగాలు ఇవే.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Jayanti: స్వామి వివేకానంద జయంతి.. వివిఐటి విద్యార్థుల సమతా వాక్

Updated Date - Jan 12 , 2025 | 04:26 PM