JNTU Kakinada : ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:55 AM
పరీక్షలకు ఉన్నత విద్యామండలి కన్వీనర్లను నియమించింది. పలు యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్లను కన్వీనర్లుగా నియమించి...

అమరావతి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యామండలి కన్వీనర్లను నియమించింది. పలు యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్లను కన్వీనర్లుగా నియమించి సెట్ల బాధ్యతలను ఆయా వర్సిటీలకు అప్పగించింది. ఈఏపీసెట్- జేఎన్టీయూ కాకినాడ, లాసెట్- పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఈసెట్- జేఎన్టీయూ అనంతపురం, పీజీఈసెట్, ఐసెట్- ఆంధ్రా యూనివర్సిటీ, పీఈసెట్-నాగార్జున యూనివర్సిటీ, ఎడ్సెట్- నాగార్జున యూనివర్సిటీ, పీజీసెట్ శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలకు అప్పగించింది. త్వరలో ఈఏపీసెట్ తేదీలు ఖరారు చేయనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..
Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..