Share News

అర్నే్‌షకుమార్‌ కేసులో సుప్రీం మార్గదర్శకాలు పాటించండి

ABN , Publish Date - Feb 20 , 2025 | 06:06 AM

తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్‌ కిరణ్‌ కుమార్‌(కిరణ్‌ రాయల్‌)పై ఎస్‌వీయూ క్యాంపస్‌ ఠాణాలో నమోదైన కేసు విషయంలో అర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

అర్నే్‌షకుమార్‌ కేసులో సుప్రీం మార్గదర్శకాలు పాటించండి

కిరణ్‌ రాయల్‌పై కేసులో పోలీసులకు హైకోర్టు స్పష్టీకరణ

అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్‌ కిరణ్‌ కుమార్‌(కిరణ్‌ రాయల్‌)పై ఎస్‌వీయూ క్యాంపస్‌ ఠాణాలో నమోదైన కేసు విషయంలో అర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. లక్ష్మీరెడ్డి అనే మహిళ ఫిర్యాదు ఆధారంగా తిరుపతి ఎస్‌వీయూ క్యాంపస్‌ పోలీసులు కిరణ్‌ రాయల్‌పై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలంటూ సంబంధిత స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ఈ నెల 13న ఆయనకు నోటీసులు ఇచ్చారు. అర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీం మార్గదర్శకాలు అనుసరించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కిరణ్‌ రాయల్‌ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.


Also Read:

వరద సాయం ప్రకటించిన కేంద్రం.. ఏపీకే ఎక్కువ

ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్.. ఐరాసలో భారత్ నిప్పులు

యుద్ధాన్ని మొదలుపెట్టిందే మీరు.. జెలెన్ స్కీపై ట్రంప్ ఫైర్..

For More Telangana News and Telugu News..

Updated Date - Feb 20 , 2025 | 06:06 AM