High Court: అవయవమార్పిడి హోదా ఇవ్వండి
ABN , Publish Date - Jul 24 , 2025 | 04:34 AM
రాష్ట్రంలోని వంద పడకల ప్రభుత్వ బోధనాసుపత్రులను అవయవమార్పిడి కేంద్రాలుగా గుర్తించేలా, ఆ హోదా
అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వంద పడకల ప్రభుత్వ బోధనాసుపత్రులను అవయవమార్పిడి కేంద్రాలుగా గుర్తించేలా, ఆ హోదా కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 2016లో దాఖలైన పిల్పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ పిల్పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2016లో పిల్ దాఖలైతే ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవమార్పిడికి అవకాశం కల్పించడం ద్వారా అవయవమార్పిడి ముఠాలను కట్టడి చేయవచ్చని పేర్కొంటూ విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!