Venkaiah Naidu: ఘనంగా వెంకయ్య మనవడి వివాహ రిసెప్షన్
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:05 AM
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవడు, స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీప, వెంకట్రావు దంపతుల కుమారుడు విష్ణు, సాత్విక వివాహ రిసెప్షన్ ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటాచలం స్వర్ణభారత్ ట్రస్ట్లో ఘనంగా జరిగింది.

హాజరైన హరియాణా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి లోకేశ్
వెంకటాచలం, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవడు, స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీప, వెంకట్రావు దంపతుల కుమారుడు విష్ణు, సాత్విక వివాహ రిసెప్షన్ ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటాచలం స్వర్ణభారత్ ట్రస్ట్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కావ్య కృష్ణారెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు.
Also Read:
గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు..
భారీ స్కామ్.. పెట్టుబడుల పేరుతో రూ.850 కోట్లకు..
For More National News and Telugu News..