Sake Shailajanath : వైసీపీలోకి సాకే శైలజానాథ్
ABN , Publish Date - Feb 08 , 2025 | 03:00 AM
పార్టీ అధ్యక్షుడు తాడేపల్లి ప్యాలె్సలో శైలజానాథ్కు వైసీపీ కండువా కప్పి, ఆలింగనం చేసుకొని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు తాడేపల్లిప్యాలెస్లో శైలజానాథ్కు వైసీపీ కండువా కప్పి, ఆలింగనం చేసుకొని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సమయంలో ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తదితరులు ఉన్నారు. ఎన్నికలకు ముందే శైలజానాథ్ పార్టీ మారతారంటూ ప్రచారం జరిగింది. ఆ సమయంలో ప్రాంతీయ పార్టీల్లో చేరినా టికెట్ దక్కే పరిస్థితి లేకపోవడంతో మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు వైసీపీలో చేరారు.