Deputy CM Pawan Kalyan : జనసేనకు ఈసీ గుర్తింపు
ABN , Publish Date - Jan 22 , 2025 | 04:03 AM
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జనసేనను ఆంధ్రప్రదేశ్లోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది.
ఇక గాజుగ్లాసు గుర్తు ఆ పార్టీకే
పవన్ కల్యాణ్కు ఎన్నికల సంఘం లేఖ
అమరావతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జనసేనను ఆంధ్రప్రదేశ్లోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. దీంతోపాటు గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీకే రిజర్వ్ చేసింది. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం లేఖ పంపింది. సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు లోక్సభ స్థానాల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో గుర్తింపు పొందిన పార్టీగా నిలిచి, గాజు గ్లాసు గుర్తును కూడా పొందింది. ఈ పరిణామంపై ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Read Latest AP News And Telugu News